మన తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ అనగానే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది చిరంజీవి.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చి మెగాస్టార్ గా ఎదిగీ టాలీవుడ్కే గాడ్ ఫాదర్ గా నిలిచాడు. తర్వాత చిరంజీవి పేరును చెప్పుకొని ఎందరో హీరోలు టాలీవుడ్ లో అడుగుపెట్టి ఎన్నో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ సమయంలోనే చిరంజీవి తన నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. ఇప్పటికే 150 పైగా సినిమాల్లో నటించి ఇప్పటికీ సినిమాలు చేస్తూ నేటితరం హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.అలాంటి చిరంజీవి కెరీర్లో కొన్ని సినిమాలు మాత్రమే అత్యధిక కలెక్షన్లు సాధించాయి.. వాటిలో సెకండ్ ఇన్నింగ్స్ లో టాప్ 3 ప్లేస్ లో ఉన్న సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఖైదీ నెంబర్ 150: చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా మొదలుపెట్టాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన కత్తి సినిమాకు ఇది రీమేక్గా తెలుగులో తెరకెక్కింది. ఈ సినిమా టాలీవుడ్ లో రూ.175 కోట్లకు పైగా భారీ కలెక్షన్లు సాధించి చిరంజీవి స్టామినా ఏమిటో మరోసారి చూపించింది. ఇందులో చిరుకు జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది.
సైరా నరసింహారెడ్డి.: ఇక తర్వాత చిరు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాను టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. 2019 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా భారీ కలెక్షన్ సాధించింది. ఈ సినిమా టాక్ పరంగా చాలా నేగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. కానీ కలెక్షన్లు పరంగా భారీగానే కొల్లగొట్టింది. ఈ సినిమాలో చిరుకు జంటగా నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటించారు.
వాల్తేరు వీరయ్య: ఇక ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి చిరు తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు చూపించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో వాల్తేరు వీరయ్య కూడా ఒకటి. ఈ సినిమాలో చిరుకు జంటగా శృతిహాసన్ హీరోయిన్గా నటించింది, అలాగే మాస్ మహారాజా రవితేజ కూడా ఇందులో మెగాస్టార్కు తమ్ముడిగా నటించాడు. మెగా దర్శకుడు బాబి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూలు సాధించింది. ప్రస్తుతం చిరు భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక మరి రాబోయే రోజుల్లో కూడా చిరంజీవి ఇంకన్ని సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.