మెగాస్టార్ 156వ సినిమాపై క్లారిటీ… అదంతా అబద్ధ‌మే…!

మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకు వెళుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన చిరంజీవి వచ్చేనెల 11న భోళాశంకర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే చిరంజీవి గత ఏడాది కూడా ఆచార్య – గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

భోళాశంకర్ తర్వాత చిరంజీవి కెరీర్లో 156వ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను చిరంజీవి కుమార్తె కొణిదల సుస్మిత నేతృత్వంలో గోల్డ్ బాగ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తారన్న ప్రచారం ఇప్పటి వరకు ఉంది. అయితే దీనిపై మరో సరికొత్త రూమర్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాను కొణిదల సుస్మిత సమర్పణలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సహానిర్మాతగా నిర్మిస్తుందన్న కొత్త ప్రచారం కూడా బయటకు వచ్చింది.

ప్రస్తుతం పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌.. పవన్ కళ్యాణ్ – సాయి ధరంతేజ్ కాంబినేషన్లో బ్రో సినిమా నిర్మించారు. బ్రో ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిరంజీవి 156వ సినిమాకు కూడా ఆయనే నిర్మాత అనేది తాజాగా వినిపించిన సమాచారం.

అయితే ఈ పుకార్లను విశ్వప్రసాద్ ఖండించారు. మా సంస్థ నుంచి చిరంజీవి గారితో సినిమా చేయడం చాలా సంతోషం.. అయితే సోషల్ మీడియాలో ఆయన 156వ‌ సినిమా తాము నిర్మిస్తున్నట్టు వస్తున్న పుకార్లు అబద్ధాలే అని ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో చిరంజీవి 156వ‌ సినిమా పూర్తిగా చిరు కుమార్తె కొణిదెల సుస్మిత ఆధ్వర్యంలోనే ఉంటుందని తెలుస్తోంది.