‘ఇచట వాహనాలు నిలపరాదు ‘ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది మీనాక్షి చౌదరి. తర్వాత రవితేజతో కలిసి ఖికిలాడి సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకు ఊహించని స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయాయి. తర్వాత హిట్ 2 లో నటించి.. ఈ సినిమాతో మొదటి హిట్ సినిమా తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దు గుమ్మ. హిట్ 2 సినిమాతో విజయాన్ని సాధించిన మీనాక్షి చౌదరికి తర్వాత వరుసగా ఆఫర్లు దక్కుతాయి అనుకుంటే అంతంత మాత్రంగానే అవకాశాలు వచ్చాయి.
కరెక్ట్ టైంలో మహేష్ బాబుకు జోడిగా ‘ గుంటూరు కారం ‘ సినిమాలో నటించే అవకాశం అందుకుంది మీనాక్షి. పూజ హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా మార్చి మీనాక్షి చౌదరిని సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేశాడు దర్శకుడు త్రివిక్రమ్. ఏకంగా మహేష్ పక్కన ఛాన్స్ రావడంతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది మీనాక్షి.
ఇక మహేష్ బాబు ‘ గుంటూరు కారం ‘ సినిమాలో అవకాశం దక్కడంతో మరో మెగా ఆఫర్ మీనాక్షి చేతిలోకి వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో నటించే అవకాశాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుణ్ తేజ్ హీరోగా కరుణకుమార్ డైరెక్షన్లో వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కబోతుంది.
ఈ సినిమా షూటింగ్ ఈ నెల 27న ప్రారంభించబోతున్నారు. ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని సెలెక్ట్ చేశారు. ఇప్పటికే ఈ స్టోరీని మీనాక్షి చౌదరికి వినిపించడం మీనాక్షి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట. హీరో విశ్వక్సేన్తో కూడా ఈ బ్యూటీ మూవీ చేయడానికి ఓకే చెప్పేసింది.