సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి డిస్కో కింగ్గా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పాపులర్ అయ్యాడు. హ్యాండ్సమ్ లుక్స్ తో ఈ హీరో ప్రముఖ హీరోయిన్లను సైతం తన వలలో వేసుకున్నాడు. సారిక, హెలెనా లూక్, యోగితా బాలితో సహా పరిశ్రమలోని టాప్ స్టార్స్తో అతను అఫైర్లు నడిపాడు. 1985లో అతిలోక సుందరి శ్రీదేవిని సీక్రెట్గా మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. మూడేళ్ల పాటు వారిద్దరూ సహజీవనం చేశారు. ఈ మూడేళ్ల సమయంలో కెరీర్ పరంగా శ్రీదేవి మిథున్కు ఎంతో సపోర్ట్ చేసింది. అతనితో సూపర్ హిట్ సినిమాలు చేయించి అతన్ని స్టార్ హీరోగా నిలబెట్టింది. అయినా ఆ కృతజ్ఞతా భావం ఏమాత్రం లేకుండా శ్రీదేవికి మిథున్ షాకిచ్చాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ నటుడు శ్రీదేవికి ఇవ్వాల్సిన క్రెడిట్ అంతా మరో హీరోయిన్ జీనత్ ఆమన్ కి ఇచ్చాడు. తాను నల్లగా ఉన్నానని పెద్ద హీరోయిన్లు అందరూ తనని దూరం పెట్టేస్తే ఒక్క జీనత్ మాత్రమే తనతో కలిసి నటించేందుకు అంగీకరించిందని తెలిపాడు. మిగతా వారెవరూ తనని కన్నెత్తి కూడా చూసేవారు కాదని, అలాంటి సమయంలో జీనత్ తన అందాన్ని పొగిడిందని చెప్పుకొచ్చాడు. “ఈ అబ్బాయి ఎవరో చాలా బాగున్నాడు. ఇతనితో కలిసి నటించడానికి ఏమైంది? అంటూ ఆమె నా సరసన హీరోయిన్గా నటించింది. ఇక ఆ తర్వాత సినీ కెరీర్లోని వెనుతిరిగి చూసుకోలేదు” అని మిథున్ చక్రవర్తి లేటెస్ట్ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశాడు.
మరి శ్రీదేవి తన సినిమా జీవితంలో చిన్న హెల్ప్ చేసిందని కూడా అతడు చెప్పలేదు. అతను అన్ని విషయాల గురించి మాట్లాడాడు కానీ శ్రీదేవి గురించి ప్రస్తావించనేలేదు. దాంతో బాలీవుడ్ ప్రేక్షకులు శ్రీదేవిని అలా మర్చిపోవడం ఏం బాగోలేదని ఈ హీరోని విమర్శిస్తున్నారు.