టాలీవుడ్ లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తాను చేసే సినిమాల కథలను ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అంత కఠినంగా తన సినిమాలకు నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టే మహేష్ సినిమాలు ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్లు కొడుతూ ఉంటాయి. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమా గుంటూరు కారంను త్రివిక్రమ్ తో చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత తన 29వ సినిమాని దర్శక ధీరుడు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇదే సమయంలో మహేష్ బాబు కెరీర్లో కథనచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రకటన చేసి కూడా మధ్యలో ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో హరే రామ హరే కృష్ణ అనే సినిమాను ప్రకటించారు.. ఈ సినిమాను సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు నిర్మించాలని కూడా భావించారు. ఏం జరిగిందో తెలియదు గానీ ఈ సినిమా సెట్స్పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.
అంతేకాకుండా విలక్షణ దర్శకుడు క్రిష్ కూడా శివమ్ పేరుతో మహేష్ బాబుతో ఓ సినిమాను ప్రకటించాడు. సోనాక్షి సిన్షా ను హీరోయిన్గా కన్ఫర్మ్ చేశాడు. ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. నియర్ దర్శకుడు మణిరత్నం మహేష్, కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. దుర్డా ఆర్ట్స్ బ్యానర్ పై హేమంబర్ జాస్తి డైరెక్షన్ లో మిర్చి టైటిల్తో సినిమా ప్రకటించారు.
అయితే ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. సూరెందర్ రెడ్డి దర్శకత్వం లో మిస్టర్ ఫర్ఫెక్ట్ కూడా ప్రకటించారు. ఇది కూడా సెట్స్ పైకి వెళ్లలేదు. వినాయక్ తో కూడా ఒక సినిమా ప్రకటించాడు. అది కూడా రాలేదు. అలాగే జనగణమన టైటిల్తో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రకటించిన సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లలేదు.