1992-93 మధ్య విడుదలైన రోజా సినిమా దేశవ్యాప్తంగా 12 భాషల్లో విడుదలైంది. ప్రేమ, ఉగ్రవాదం కలబోతగా ఈ సినిమాను రూపొందించారు మణిరత్నం. సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా.. ప్రేమ, పెళ్లి చుట్టూ తిరుగుతుంది. పెళ్లి చూపులకు వెళ్లిన హీరో.. పెళ్లికుమార్తెను కాదని ఆమె చెల్లిని వివాహం చేసుకుంటానని చెప్పడం ఈ సినిమాలో కొంత ఆసక్తికర విషయం.
ఇలా సాధారణ కథతో ప్రారంభమైన సినిమా.. అనూహ్యంగా ఉత్కంఠకు దారితీస్తుంది. హీరోను ఉగ్రవా దులు అపహరించడంతో సినిమా స్టోరీ అంతా మారిపోతుంది. నిజానికి ఆ సమయంలో దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల అలజడి ఎక్కువగా ఉంది. దీంతో కేంద్రంలోని అప్పటి కేంద్ర ప్రభుత్వం చాలా కట్టుదిట్టం చేసింది. అయితే.. ఇదే సమయంలో ఈ సినిమా షూటింగు కోసం దర్శకుడు మణిరత్నం కశ్మీర్ అటవీ ప్రాంతాన్ని ఇవ్వాలని అనుమతి కోరారు.
ముందు ఏదో ఒకరకంగా.. కొంత పార్టు వరకు అయినా.. అక్కడ సినిమా షూట్ చేసుకుందామని ప్రయ త్నించారు. ముందు ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం షూటింగ్ సమయానికి రద్దు చేసింది. దీనికి కూడా కారణం ఉంది. సరిహద్దుల్లో ఉగ్రవాద తీవ్రత పెరిగి.. భారత దేశం అలెర్ట్ అయింది. ఈ నేపథ్యంలో మణిరత్నం సినిమాను వాయిదా వేయాలని అనుకున్నారు.
కానీ, నిర్మాణ సంస్థ మాత్రం ఒప్పుకోలేదు. దీంతో మద్రాస్లోని శివారు ప్రాంతంలో అటవీ సెట్టింగ్ వేసి.. కొంత భాగం చిత్రీకరించారు. కానీ, ఎక్కడా మనకు ఈ విషయం తెలియకుండా.. మణిరత్నం మేనేజ్చేయడం విశేషం. అచ్చం కశ్మీర్ ప్రాంతంలో నే చిత్రీకరించినట్టు సినిమా తీయడం మణిరత్నానికే సాధ్యమైందనే కామెంట్లు వచ్చాయి.