ఆ విషయంలో మహేష్ నే మించిపోయిన కూతురు సితార.. ఏకంగా పాన్ వరల్డ్ స్థాయి అందుకునేసిందిగా..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఒక్క సినిమాలు.. మరో వైపు కమర్షియల్ యాడ్స్‌ తో రెండు చేతుల సంపాదిస్తూ బిజీగా కొనసాగుతున్నాడు. ఇక‌ ఇప్పుడు మహేష్ కు తన కూతురు సితార నుంచి గట్టి పోటీ వచ్చి పడింది. చిన్న వయసులోనే తనను మించిపోయాన‌ని తండ్రికి ఆదిరిపోయే షాక్ ఇచ్చేసింది.

మహేష్ కూతురు సితారని చిన్నప్పటినుంచి అందరూ చూస్తున్నం.. ఎప్పటికప్పుడు మహేష్- నమ్రత షేర్ చేసిన ఫోటోలు వీడియోలు వల్ల సితార ఎలా ఉంది.. ఏం చేస్తుందో అనేది అందరికీ తెలుస్తూనే ఉంది. ఇక ఇప్పటికే సితార డాన్స్ చేసిన వీడియోలు అయితే ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ.. ఈ సూపర్ స్టార్ కూతురికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. అయితే రీసెంట్ గా ఈమె ఓ జ్యువెలరీ యాడ్ షూట్ లో కూడా పాల్గొంది.

మహేశ్‌ గారాల పట్టి సితార తాజాగా ‘పీఎంజే జువెలరీ’కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంది. సితార చేసిన తొలి కమర్షియల్‌ యాడ్‌ ఇది. ఈ యాడ్‌ కోసం సీతార‌ మూడు రోజుల పాటు షూటింగ్‌లో కూడా పాల్గొన్నారని తెలుస్తుంది. సితార చేసిన తొలి కమర్షియల్‌ యాడ్‌ను ‘సితార కలెక్షన్స్‌’ పేరుతో అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలో ప్రఖ్యాత టైమ్‌ స్వ్కేర్‌పై ప్ర‌దర్శించారు. ఈ విషయాన్ని స్వ‌యంగా ‘మహేశ్ త‌న‌ సోషల్‌ మీడియా లో షేర్ చేశాడు. ఇక ప్రస్తుతం సితారకు సంబంధించిన ఆ ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మ‌రాయి.

‘ప్రిన్సెస్‌ సితార’ అని టైమ్‌ స్వ్కేర్‌పై రాసి ఉంది. ఫోటోలలో సీతూ పాప పలు రకాల జువెలరీ వేసుకుని చాలా అందంగా ఉన్నారు. టైమ్‌ స్వ్కేర్‌పై సితార ఫోటోలను చూసి మహేశ్‌ బాబు ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. టైమ్‌స్వ్కేర్‌లో సితారను చూడడం చాలా గర్వంగా ఉందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.ఇక ఈ రోజు (4 జూలై) అమెరికా ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా సితార ఫోటోలను టైమ్‌ స్వ్కేర్‌పై ప్రదర్శించారు. దీంతో సీతార‌ మరోసారి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది..!!

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)