దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు వీరిద్దరికి టాలీవుడ్ లో ఎంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. ఇక రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు రూ.1500 నుంచి రూ.1800 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమా కోసం మహేష్ బాబు ముందుగానే కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ఈ సినిమా లుక్ కోసం జిమ్ లో కష్టపడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త వినిపిస్తుంది. యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని.. ఆ ముగ్గురిని బాలీవుడ్ నుంచి ఎంపిక చేస్తున్నారని సమాచారం అందుతుంది. హీరోయిన్స్ గా దీపికా పదుకొనే, అలియా భట్, ప్రియాంక చోప్రాలను సెలెక్ట్ చేయగా ఈ సినిమాలో నెగటివ్ రోల్ కోసం బాలీవుడ్ ముద్దుకొమ్మ ఐశ్వర్యరాయ్ని ఫిక్స్ చేశాడట రాజమౌళి.
2024 లో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకి హాలీవుడ్ సంస్థ పెట్టుబడి పెట్టబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డైరెక్టర్ కె.ఎల్ నారాయణ ఈ సినిమా నిర్మించబోతున్నాడు. విజయేంద్ర ప్రసాద్ అందించిన ఈ కథలో మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టి వచ్చే యాత్రికుడిలా కనిపించబోతున్నాడు. ఎక్కువ భాగం అమెజాన్ అడవుల్లో షూట్ జరుపుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రూపొందించబడుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.