టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత ఈ జంట ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. మహేష్ షూటింగ్ కి బ్రేక్ దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గరి నుంచి రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అవుతూనే ఉంది.
ఈ సినిమా షూటింగ్ మరోసారి పోస్ట్ పోన్ అవ్వడంతో మహేష్ తన ఫ్యామిలీతో కలిసి లండన్ ట్రిప్కి వెళ్ళాడు. లండన్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి నమ్రత – మహేష్ బాబు ఎంజాయ్ చేస్తున్నారు. నమ్రత తన సోదరితో కలిసి ఎంజాయ్ చేస్తూ.. అలాగే మరి కొందరు ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ చేస్తూ ఫొటోలు దిగింది.
ఆ ఫొటోలు నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అవి వైరల్ అయ్యాయి. ఇందులో మహేష్ బాబు లాంగ్ హెయిర్ తో మరింత యంగ్ లుక్ లో కనిపించడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ పిక్స్ చూసి తెగ మురిసిపోతున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా తప్పుకోవడంతో శ్రీలీలా మొదటి హీరోయిన్ గా , మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా ఎంపికయ్యారు.
గుంటూరు కారం సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే దర్శకధీరుడు రాజమౌళితో.. మహేష్ బాబు సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా షూటింగే ఏకంగా రెండేళ్లకు పైగా ఉంటుందని అంటున్నారు.