అతడు, ఖలేజా, గుంటూరు కారం ఈ మూడు సినిమాలకు దెబ్బ‌కొట్టిన బ్యాడ్ సెంటిమెంట్ ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకో కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని కాంబినేషన్లో సినిమా రిలీజ్ అయితే హిట్ అవుతుందని నమ్మకంతో ఉంటారు. కానీ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ మాత్రం ఓ వింత కాంబినేషన్ గా పేరు తెచ్చుకుంది. ఈ కాంబినేషన్ లో సినిమా రూపొందిస్తే ఆ నిర్మాతకు ఒక్క రూపాయి కూడా మిగలదు భారీ నష్టాలు నిర్మాతలు చూడాల్సి వస్తుందని కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహేష్ ,త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఫస్ట్ మూవీ ‘ అతడు ‘. ఈ సినిమా హిట్ అని మహేష్ బాబు ఫ్యాన్స్ వాదించినా ట్రేడ్ లెక్క‌ల‌తో చూస్తే అత‌డు యావరేజ్ గానే ఆడింది. ఈ సినిమా నిర్మాతకు కొంత నష్టం తెచ్చి పెట్టింది. ఈ సినిమా షూటింగ్ కూడా అనుకున్న టైం కన్నా ఎక్కువ రోజులు పట్టింది. ఇక ఈ సినిమా తర్వాత మురళీమోహన్ ఏ సినిమా ప్రొడ్యూస్ చేయలేదు.

దీని తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ ఖలేజా ‘. ఈ సినిమా టైటిల్ విషయంలో కొన్ని వివాదాల్లో చిక్కుకుని సినిమా షూటింగ్ చాలా రోజులు పట్టింది. మహేష్ బాబు కెరీర్ లోనే అతి ఎక్కువ రోజులు షూటింగ్ జరిగిన సినిమాల్లో ఖలేజా సినిమా ఒకటి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి శింగ‌న‌మ‌ల‌ రమేష్ బాబు, సి కళ్యాణ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.
ఆ తర్వాత రమేష్ బాబు పలు వివాదాల్లో చిక్కుకొని సినిమాలకు దూరమయ్యాడు.

ఇక ఇప్పుడు ‘ గుంటూరు కారం ‘ సినిమా. వీరిద్దరి కాంబినేషన్లో గుంటూరు కారం సినిమాలో ఇప్పటికి చాలామంది టెక్నీషియన్ల‌తో పాటు హీరోయిన్ పూజ హెగ్డే తప్పుకున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్‌తో పాటు మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ కూడా త‌ప్పుకుంటార‌ని టాక్ ? దీనివల్ల ప్రొడ్యూసర్స్ కు అదనకు భారం పెరిగింది. సినిమా షూటింగ్ కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ అసలు ప్రాఫిట్‌గా వర్కౌట్ అవ్వద‌న్న ప్ర‌చారం మ‌రోసారి జ‌రుగుతోంది. మ‌రి ‘ గుంటూరు కారం ‘ మూవీ అయిన రిలీజ్ అయి హిట్ కొట్టి ఈ అనుమానాలను ప‌టాపంచ‌లు చేస్తుందో ? లేదో చూడాలి.