ఆ స్టార్ హీరోయిన్ ఎఫెక్ట్‌… మ‌హేష్‌తో న‌మ్ర‌త విడాకులు తీసుకోవాల‌నుకుందా..?

టాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో మహేష్ బాబు – నమ్రత శిరోద్క‌ర్‌ జంట ఒకటి. ఈ జంట ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2005లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య మొద‌ట్లో గొడవలు రావడంతో విడాకులు తీసుకోవాలనుకున్నారట‌. మరీ ముఖ్యంగా మహేష్ బాబు స్టార్ హీరోయిన్ తో ఎఫై…*ర్ నడిపాడ‌నే అనుమానంతో నమ్రత – మహేష్ బాబు పై సీరియస్ అయ్యిందని.. ఈ కారణంగానే వీరిద్దరి మధ్యన గొడవలు పెరిగాయని సమాచారం.

ఇక నమ్రత – మహేష్ బాబుల పెళ్లి కాకముందే మహేష్ బాబు, త్రిషతో పలు సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో స్టార్ హీరో హీరోయిన్లు కలిసి నటిస్తే వారిద్దరి మధ్యన ఎ..*ఫైర్ వార్తలు సర్వసాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వార్తలు మహేష్ – త్రిష‌ మధ్యన రావడంతో నమ్రత ఈ వార్తలను నిజమని నమ్మి మహేష్ బాబుతో గొడవ పడడం మొదలుపెట్టిందట. తర్వాత ఈ గొడవ కాస్త పెద్దదై వారిద్దరూ విడాకుల వరకు వెళ్లిందని అప్పట్లో వార్తలు వినిపించాయి.

అయితే కొంతకాలానికి వాళ్ళ‌ మధ్య ఎటువంటి సంబంధం లేదని తెలుసుకున్న నమ్రత.. మహేష్ బాబు ని అర్థం చేసుకుని అతనితో కలిసిపోయిందట. ఆ తర్వాత ఎప్పుడు వీరిద్దరి మధ్య ఎటువంటి గొడవలు జరగలేదట‌. ఇక అప్ప‌టినుంచి మహేష్ బిజినెస్‌లు అన్ని నమ్రతన్నే చూసుకుంటోంది. ఇంట్లో కూడా నమ్రత ఏది చెబితే అదే జరుగుతుందట. ప్రస్తుతం వీరిద్దరూ ఎంతో ఆనందంగా పిల్లలతో కలిసి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో మహేష్ కూతురు సితార – జూనియర్ ఎన్టీఆర్ కొడుకు భార్గవ్ రామ్ అక్క, తమ్ముళ్లుగా కనిపిస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.