సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాంటి మహేష్ బాబు కారణంగా మరో అగ్ర హీరో రానాకు ఏకంగా రూ.100 కోట్ల నష్టం రావటం ఏంటి.. అని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారా..? అసలు విషయం ఏమిటి అంటే కోలీవుడ్ స్టార్ దర్శకుడు మురుగదాస్ 2004లో గజిని కథను రెడీ చేసుకుని హీరో కోసం వెతకటం మొదలుపెట్టాడు. ఆ సమయానికి రానా హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవ్వలేదు. తన తండ్రి సురేష్ బాబు నిర్మిస్తున్న సినిమాల కథల విషయంలో మాత్రం ఎంతో చురుగ్గా పాల్గొనేవాడు. అలాంటి సమయంలోనే ఒకరోజు చెన్నై నుంచి సురేష్ బాబు ని కలవడానికి మురుగదాస్ రామానాయుడు స్టూడియోలోకి వచ్చాడు.
ఆ సమయంలో సురేష్ బాబు తో పాటు రానాకు కూడా తన దగ్గర ఉన్న గజిని కథను చెప్పాడు. అంతేకాకుండా తండ్రీ కొడుకులకి ఈ కథ ఎంతో నచ్చింది. వెంటనే సురేష్ బాబు ఈ కథతో సినిమా చేయడానికి తెలుగు హీరోలు ఎవరు ఇంట్రెస్ట్ చూపరని కథ నచ్చి సినిమా చేస్తే మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మొహమాటం లేకుండా చెప్పేశారు. అదే సమయంలో రానా ఈ సినిమా మహేష్ బాబుతో చేస్తే మరో లెవెల్ లో ఉంటుందని అప్పటికే మహేష్ తన కెరీర్లు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.
ఇక ఆ సమయంలోనే అతడు, పోకిరి వంటి వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. అంతేకాకుండా నిజం- నాని వంటి ఎన్నో ప్రయాగాత్మక సినిమాల్లో కూడా నటించాడు. అందుకే రానా, మహేష్ బాబుతో ఈ సినిమా చేస్తే బాగుంటుందని భావించాడు. దర్శకుడు మురుగదాస్, మహేష్ ను కలవగా గజినీ స్టోరీ చెప్పగా తెలుగులు ఇలాంటి స్టోరీలపై ప్రేక్షకులు ఆసక్తి చూపరు చేస్తే ఇతర ఇండస్ట్రీల హీరోలతో చేయాలని మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఆ సమయంలో రానాకి ఈ కథ బాగా నచ్చడంతో ఎలాగైనా తెలుగు రైట్స్ కొనాలని ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ తెలుగు హీరోలు ఎవరు ఈ కథపై ఆసక్తి చూపించక పోవడంతో రానా తన ఆలోచనను మార్చుకున్నాడు.
ఇక తర్వాత గజినీ సినిమాను మురగదాస్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో తీసి భారీ హిట్ అందుకున్నాడు. ఇక తెలుగు మూవీ రైట్స్ను అల్లు అరవింద్ కొన్నాడు. అంతేకాకుండా ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేయగా అందులో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన ఈ మూవీ అక్కడ కూడా భారీ విజయం సాధించింది. అంతేకాకుండా ఈ సినిమా హిందీలో రూ.100 కోట్లకు పైగా భారీ కలెక్షన్లు అందుకుంది. ఇలా మహేష్ బాబు కారణంగా రానా వందకోట్ల వసూలు చేసే భారీ సినిమాను తన కెరీర్ లో పోగొట్టుకున్నాడు.