లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ నిశ్చితార్థం హైదరాబాద్ లో జూన్ 09న జరిగింది. ఈ యేడాది చివర్లోనే వీరిద్దరు పెళ్లితో దంపతులు కాబోతున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మూవీ సమయంలోనే వరుణ్, లావణ్య ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత మరోసారి వీరు అంతరిక్షం సినిమాలో కలిసి నటించారు. దాదాపు ఏడేళ్ల పాటు వీరు ప్రేమించుకున్నా కానీ ఎవ్వరి కంట పడకుండా రహస్యంగా తమ ప్రేమను మెయింటైన్ చేశారు.
ఇక పెళ్లి తర్వాత లావణ్యను సినిమాలు చేయవద్దని మెగా ఫ్యామిలీ కండీషన్లు పెట్టిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే లావణ్య కూడా ఓ కండీషన్ పెట్టిందని తెలుస్తోంది. తనకు ఎంతో ఇష్టమైన క్లాసికల్ డ్యాన్స్ ప్రదర్శనలు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పవద్దని ఖరాఖండీగా చెప్పేసిందట. ఈ క్రమంలోనే లావణ్య ప్రస్తుతం ఒకేసారి మూడు ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పింది. లావణ్య తాను చేస్తోన్న సినిమాల వివరాలు కూడా చెప్పేసింది.
తమిళంలో అధర్వతో ఓ సినిమా చేయనుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమాకు ఓకే చెప్పింది. ఇక అన్నపూర్ణ స్టూడియోస్, హాట్ స్టార్ కాంబోలో ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించనుంది. ఈ మూడు సినిమాలు ఎంగేజ్ మెంట్కి ముందే ఒప్పుకున్న సినిమాలు. దీంతో ఈ మూడు సినిమాలు చేశాక ఆమె నటన ఆపుతుందా కంటిన్యూ చేస్తుందా ? అన్నది కాస్త సస్పెన్స్.
అయితే సమంత, నయనతార, కాజల్ లాంటి స్టార్ హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వారు మారుతూ నటన మాత్రం వదిలి పెట్టడం లేదు. వారి భర్తల సహకారంతో ముందుకు సాగుతున్నారు. సమంత మాత్రం విడాకులు తీసుకున్నాక కూడా నటిస్తోంది. ఏదేమైనా పెళ్లి తర్వాత కూడా లావణ్య ఈ గ్లామర్ ఫీల్డ్లో కొద్ది రోజులు అయినా కంటిన్యూ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.