టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టెంపర్ సినిమా నుంచి ఆరు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లోనే ఈ తరం జనరేషన్ హీరోలలో ఎవరికీ సాధ్యం కాని విధంగా డబుల్ హ్యాట్రిక్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఎన్టీఆర్ 2011లో ప్రముఖ వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు ఏకైక కుమార్తె లక్ష్మి ప్రణతిని పెళ్లి చేసుకున్నారు. మే 5, 2011 న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ దంపతులకు అభయ్ రామ్, భార్గవరామ్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. పెళ్లిలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కట్టుకున్న చీర అప్పట్లో ఓ సెన్సేషనల్.
బంగారు వర్ణం ఈ చీర ధర అప్పుడే కోటి రూపాయలకు పైగా ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యలో బంగారాన్ని మిక్స్ చేసి బంగారపు చారలతో బంగారపు రంగులో ఈ చీరను ప్రత్యేకంగా డిజైన్ చేయించారట. ఇందుకోసం కోటి రూపాయలకు పైగానే ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్టీఆర్ పెళ్లి వేడుకల కోసం మామ నార్నే శ్రీనివాసరావు రు. 100 కోట్లకు పైగా ఖర్చు చేశారట. లక్ష్మీ ప్రణతి ధరించిన ఈ బంగారపు వర్ణం చీర తెలుగు సంప్రదాయం ఉట్టుపడేలా ఉంది.
కంజీవరం చీరలో స్వచ్ఛమైన బంగారం, వెండితో ఈ చీరను ప్రత్యేకంగా నేచారట. చీరకు తగ్గట్టుగానే లక్ష్మి ప్రణతి బంగారం, వజ్రాల నెక్లెస్, మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నారు. వాటితో పాటు ఒక జత డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా ఆమె ధరించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సంప్రదాయమైన తెల్లని కొత్త ధోవతితో మెరిసిపోయారు.
అప్పట్లోనే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి కళ్యాణ మండపం విలువ రు. 18 కోట్లు ఈ వేడుకలకు మొత్తం ఐదు వేలమంది అతిధులు.. 12 వేల మంది అభిమానులు హాజరయ్యారు. ఈ జంటకు 2014లో మొదట అభయ్ రామ్ జన్మించగా.. 2019లో భార్గవ్రామ్ పుట్టాడు. ఈ ఏడాది మార్చిలో లక్ష్మీ ప్రణతి తన 30వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు.