టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ నటీనటులు ఒకరినొకరు వివాహం చేసుకొని హ్యాపీగా సెటిల్ అయ్యారు. అలాంటి స్టార్ కపుల్ ఎవరంటే ముందుగా గుర్తుకు వచ్చేది విజయనిర్మల – కృష్ణ జంట. వీరిద్దరూ ఒకరిని ఒకరు వివాహం చేసుకున్న దగ్గర నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటూ జీవితాన్ని గడిపారు. చివరి రోజుల్లో విజయనిర్మల అనారోగ్యంతో మరణించగా.. విజయనిర్మల చనిపోయిన కొన్ని రోజులకే కృష్ణ కూడా మరణించారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విజయనిర్మల ఎంత మొండిదో అంతే పట్టుదలతో ఉన్న మనిషి అని అందరికీ తెలుసు.
ఆమె అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు అలానే సినిమాలో, నిర్మాణం, డైరెక్షన్ రంగాలలో ఆమె పట్టుదలతో సక్సెస్ సాధించింది. ఇక విజయనిర్మల నటించిన దేవదాసు సినిమా చూసి హీరోయిన్ వాణిశ్రీ వెటకారంగా ఓ సందర్భంలో కౌంటర్ వేసిందట. ఆ కౌంటర్ కు కోపానికి గురైన విజయనిర్మల చనిపోయే వరకు కూడా వాణిశ్రీ తో మాట్లాడలేదని వార్తలు వినిపిస్తున్నాయి. కృష్ణ – విజయనిర్మల కలిసి దేవదాసు సినిమాలో నటించగా ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇదే టైంలో వాణిశ్రీ.. రామప్రభతో మాట్లాడుతూ.. ఏఎన్ఆర్ నటించిన దేవదాస్ సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తే ఇప్పటికీ కొన్ని వందల మంది చూస్తారు. విజయనిర్మల నటించిన దేవదాస్ సినిమా రిలీజ్ చేస్తే హాల్లో దోమలు తప్ప మనుషులు ఉండరు అని సెటైర్ వేసిందట.
దాంతో కోపం వచ్చిన విజయనిర్మల ఉన్నది ఉన్నట్లుగా చెడమడ తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని.. అప్పటి నుంచి మరణించే వరకు వాణిశ్రీ తో మాట్లాడలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కృష్ణని కూడా ఆమెతో కలిసి నటిస్తే ఊరుకోనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. 15 ,16 ఏళ్ళ తర్వాత నిర్మాత, దర్శకుల బలవంతం మీద ఓ సినిమాను ఓకే చేశాడట కృష్ణ. ఇక సినిమా సెట్స్ పై ఉండగా విజయనిర్మల కోపంతో వచ్చి కృష్ణను తీసుకువెళ్లిపోయిందట. దీంతో ఈ సినిమా హీరో సుమన్ ని పెట్టి తెరకెక్కించారు మూవీ టీం .చివరకు విజయనిర్మల తాను అనుకున్నది ఎలాగైనా సాధించింది.