భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్కి పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కియారా ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి వినయ విదేయ రామా సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవడంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.
ఇక దీంతో ఆమె బీటౌన్ పై ఫుల్ ఫోకస్ పెట్టి అక్కడే వరుస సినిమాల్లో బిజీ అయిపోయింది. ప్రస్తుతం గేమ్ చేంజెర్ సినిమా ద్వారా మళ్ళీ టాలీవుడ్ లో రామ్ చరణ్కు జంటగా నటిస్తుంది కియారా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది అన్న సంగతి తెలిసిందే. ఇక కియారాకి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు త్వరగా ప్రెగ్నెంట్ కావాలని ఉందంటూ చెప్పుకొచ్చింది.
2019లో వచ్చిన గుడ్ న్యూస్ సినిమా రిలీజ్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనకు త్వరగా ప్రెగ్నెంట్ కావాలని ఉందని.. ఆ టైంలో నాకు నచ్చిన ఫుడ్ నేను తినవచ్చు.. అందుకు ఎవరూ అడ్డు చెప్పేవారు ఉండరు అని వివరించింది. అలాగే నాకు పుట్టబోయే బిడ్డ అమ్మాయి అయినా అబ్బాయి అయినా హెల్తీగా ఉంటే చాలని వివరించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇది ఇలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ మల్హోత్రా – కియారా 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2021లో షేర్షా సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఒకరికొకరు ప్రేమలో పడి తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ఓ ఇవెంట్లో పాల్గొన్న కియారా పొట్ట కాస్త పెద్దగా కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అంటు సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మళ్లీ స్లిమ్ అయి ఆ వార్తలకు చెక్ పెట్టింది కియారా.
View this post on Instagram