బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ మహానటి ‘ సినిమా కీర్తి సురేష్‌కు అన్ని క‌ష్టాలు తెచ్చిపెట్టిందా… చేతిలో డ‌బ్బుల్లేక‌…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ తన నటనతో సావిత్రినే మరోసారి గుర్తు చేసింది. సావిత్రి ఇలా ఉంటుందా అనే విధంగా ఆమె క్యారెక్టర్ లో జీవించేసింది. కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా తర్వాత కీర్తి ఆ క్రేజ్ ఉపయోగించుకుని కోట్లు సంపాదించిందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే రీసెంట్‌గా కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేసింది. మహానటి సినిమా చేశాక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల‌కు గుర‌య్యాన‌ని తెలిపింది. ఆ సినిమా సక్సెస్ తర్వాత వరుసగా ఎన్నో అవకాశాలు వచ్చినా… అవన్నీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు.. దాంతో ఎలాంటి ?సినిమాలో నటించాలో తెలియక ఒక్క‌టీ ఒప్పుకోలేద‌ని చెప్పింది.

అలా ఆరు నెల‌ల పాటు నా చేతిలో ఒక సినిమా కూడా లేక డబ్బులు కూడా ఉండేవి కావు.. ఆ సమయంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. ఆ క్రమంలోనే చేతి ఖ‌ర్చులు కోసం కొన్ని సినిమాలు చేశాను.. అవి నాకు ఎంతో నిరాశను మిగిల్చాయ‌ని వాపోయింది. ఆ టైంలోనే కీర్తి పెంగ్విన్, మిస్ ఇండియా వంటి సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవని ఎంతో ఆనందంగా ఉన్నట్లు ఆ ఇంటర్వ్యూలో కీర్తి తెలిపింది.

అయితే ఇప్పుడు కీర్తి సురేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం మ‌హానాటి లాంటి గొప్ప‌ సినిమా తర్వాత కీర్తి ఇన్ని కష్టాలు పడిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. అలాగే కోలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.