ఏపీలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మణికంఠ మృతి గత మూడు రోజులుగా తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లాకు చెందిన సీఎం ఈనెల 25న అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. ముందుగా శ్యామ్ ఉరివేసుకోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అందరూ భావించారు. అయితే మృతుడి ఒంటిపై తీవ్ర గాయాలు ఉండడంతో అనేక అనుమానాలు కలిగాయి.
దీనికి తోడు శ్యామ్ ఎడమ చేతిపై బ్లేడుతో కోసిన గాయాలు కూడా ఉన్నాయి. దీంతో శ్యామ్ తండ్రి తమ కొడుకుది ఆత్మహత్య కాదు హత్య అని ఆరోపించారు మరోవైపు శ్యామ మృతికి న్యాయం జరగాలంటూ తారక్ అభిమానులతో పాటు టాలీవుడ్కు చెందిన ఇతర స్టార్ హీరోల అభిమానుల సైతం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. చివరకు శ్యామ్ మృతిపై రాజకీయ రంగు కూడా పులుముకుంది.
చంద్రబాబు లోకేష్ కూడా దీనిపై స్పందించారు. ఇది వైసిపి వాళ్ళు చేసిన హత్య అంటూ ఆరోపించారు. చివరికి జూనియర్ ఎన్టీఆర్ కూడా తన అభిమాని ఎలా ? మృతి చెందాడో తెలియకపోవటం బాధాకరమని.. దీనిపై ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆవేదనతో ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఎట్టకేలకు శ్యామ్ మృతిపై ఉన్న మిస్టరీ వీడింది.
శ్యామ్ మరణానికి ముందు రికార్డు చేసిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. తాను ఎవరికి పనికిరాని వాడిని అని.. తాను జీవితంపై విరక్తి చెందానని అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ చెప్పిన వీడియో బయటకు వచ్చింది. దీంతో శ్యామృతిపై ఎప్పటి వరకు ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. దీంతో శ్యామ్ది ఆత్మహత్య అంటూ పోలీసులు చెబుతున్నారు.
అయితే దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతున్నామని పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం మరింత క్లారిటీ వస్తుందని డిఎస్పి వెంకటరమణ చెప్పారు. ప్రాథమిక నివేదిక ప్రకారం ప్రేమ వివాహారమే శ్యామ్ ఆత్మహత్యకు కారణమై ఉంటుందని.. అలాగే చదువులో వెనుకబాటు కూడా మరో కారణంగా కనిపిస్తుందని చెబుతున్నారు.