‘ జులాయి ‘ వంటి బ్లాక్ బస్టర్ సినిమా వదులుకున్న స్టార్ హీరో..!

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా జులాయి. ఈ సినిమా అప్పట్లో అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ హీట్ గా నిలిచింది. ఈ సినిమా వచ్చి పది సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాకు ముందు అలు అర్జ‌న్‌ తన కెరీర్లో ఆశించినంత విజయాలు అందుకోలేకపోయాడు.

వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో త్రివిక్రమ్ తో కలిసి ఈ సినిమా చేశాడు. త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకి ముందు మహేష్ బాబుతో ఖలేజా సినిమా తీసి సరైన విజయం అందుకోలేకపోయాడు. ఇలా ఇద్దరు కెరీర్ లో వరస్ట్ ఫేస్ లో ఉన్న సమయంలో కలిసి ఆ రోజుల్లో చేసిన సినిమా ఇది. ఆ సమయంలోనే జులాయి సినిమా రూ.40 కోట్ల రూపాయల వసూలు సాధించి, ఓవర్సీస్ లోను 1న్ మిలియన్ కి పైగా డాలర్స్ ని రాబట్టింది.

ఈ సినిమా తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్లో రెండు సినిమాల వచ్చాయి. ఆ రెండు కూడా బ్లాక్ బస్టర్ హీట్ అయ్యాయి. అయితే జులాయి సినిమాని ముందుగా త్రివిక్రమ్ అల్లుఅర్జున్‌తో చేయాలని భావించలేదట. ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రాసుకున్నాడు. అయితే ఖ‌లేజా సినిమా సరిగ్గా ఆడక పోవడంతో మహేష్ కొంతకాలం త్రివిక్రమ్ కు దూరంగా ఉంటూ వచ్చాడు.

ఖలేజా సినిమా తర్వాత మళ్లీ ఇప్పటిదాకా వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాలేదు. ఇన్ని సంవత్సరాలకు వీరి కాంబినేషన్లో గుంటూరు కారం అనే సినిమా వస్తుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇలా జూల‌యి ఇలాంటి బంపర్ హిట్ సినిమాను మహేష్ మిస్ చేసుకున్నాడనే వార్తని విని ఆయన అభిమానులు అయ్యో ఎంత మంచి సినిమా మిస్ అయ్యింది అని బాధ పడుతున్నారు.