జ‌య‌ల‌లిత వేధింపులు భ‌రించ‌లేక చెన్నై వ‌దిలేస్తాన‌న్న స్టార్ హీరోయిన్‌…!

త‌మిళ‌నాడులోనే తెలుగు ఇండ‌స్ట్రీ ఉన్న కాలంలో ఎస్. వ‌ర‌ల‌క్ష్మి దూసుకుపోయారు. అనేక సినిమాల్లో ఆమె న‌టించారు. బాల భార‌తం సినిమాలో గాంధారిగా న‌టించి నంది పుర‌స్కారం అందుకున్నారు. అయితే.. దీనికి ముందు ఆమె మ‌ద్రాస్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. నిజం చెప్పాలంటే..అ న్న‌గారు ఎన్టీఆర్‌, అక్కినేనిల క‌న్నా ముందు నుంచి తెలుగు తెర‌పై త‌న న‌ట‌నా కౌశ‌లాన్ని ప్ర‌ద‌ర్శించారు.

కేవ‌లం న‌ట‌న‌కే ప‌రిమిత‌మైతే క‌ష్ట‌మ‌న్న‌.. అప్ప‌టి ద‌ర్శ‌క‌, నిర్మాత‌, న‌టుడు చిత్తూరు వి. నాగ‌య్య సూచ‌న ల‌తో ఆమె గాత్రం, డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు. దీంతో ఆమెకు ఎక్క‌డా అవ‌కాశాలు త‌గ్గ‌లేదు. త‌ర్వాత‌.. అనేక సినిమాల్లో ఆమె అద్భుత న‌ట‌న‌కు అవ‌కాశం ఉన్న పాత్ర‌ల‌ను ఎంచుకుని మ‌రీ చేశారు. నిజానికి ఒక ఆఫ‌ర్ వ‌స్తే.. వ‌దులుకునేందుకు ఎవ‌రూ సిద్ధ‌ప‌డ‌రు.

కానీ, ద‌శాబ్ద కాలం పాటు నిర్మాత‌లు… ద‌ర్శ‌కులు ఆమె అనుగ్ర‌హం కోసం ఎదురు చూశారు. అలాంటి వ‌ర‌ల‌క్ష్మి ఒక సంద‌ర్భంలో ప‌త్రికా స్టేట్‌మెంట్ ఇచ్చారు. నేను త్వ‌ర‌లోనే మద్రాస్ ఇంటిని అమ్మేసి బెంగ‌ళూరుకు వెళ్లిపోతున్నాను. సినిమాల‌కు ఫుల్‌స్టాప్ పెడుతున్నాన‌ని ప్ర‌క‌టించారు. దీంతోఆమె అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు.

దీనికి కార‌ణం.. అప్ప‌టి సీఎం జ‌య‌ల‌లిత వేధింపులు భ‌రించ‌లేకేన‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. తెర‌వెనుక ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. ప్ర‌భుత్వంతో ఆమె సంప్ర‌దింపులు చేశారు. త‌ర్వాత‌.. చెన్నైలోనే ఉన్నారు. గ‌తంలో ఎంజీఆర్‌కు న‌మ్మిన బంటుగా ఉన్న జ‌య‌ల‌లిత‌తో పాటు వ‌ర‌ల‌క్ష్మి కూడా పార్టీలో ప‌నిచేశారు.