పోల‌వ‌రం ఎమ్మెల్యే బాల‌రాజుకు జ‌గ‌న్ వార్నింగ్‌… టిక్కెట్ గ‌ల్లంతేనా ?

ఏలూరు జిల్లా వైసీపీ వ‌ర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేల‌ను ఇప్ప‌టికే పిలిచి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంతో పాటు ప‌నితీరు మార్చుకోక‌పోతే టిక్కెట్ ద‌క్క‌ద‌ని ఇప్ప‌టికే వార్నింగ్‌లు ఇవ్వ‌డం ప్రారంభించేశారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ తాజా విడ‌త‌లో నిర్వ‌హించిన స‌మావేశంలో ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఈ లిస్టులో ఏలూరు జిల్లా పోల‌వ‌రం ఎమ్మెల్యే తెల్లం బాల‌రాజు కూడా ఉన్న‌ట్టు టాక్ ? బాల‌రాజు వైసీపీలో సీనియ‌ర్ నేత‌. ఆయ‌న‌కు అస‌లు ఎస్టీ కోటాలో మంత్రి ప‌ద‌వి రావాల్సి ఉన్నా కూడా రాక‌పోవ‌డం బ్యాడ్‌ల‌క్‌. 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన బాల‌రాజు 2012 ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచారు. 2014 ఎన్నిక‌ల్లో ఓడినా, 2019 ఎన్నిక‌ల్లో 40 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు.

వైసీపీ ఆవిర్భావం త‌ర్వాత ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా వైసీపీ అధ్య‌క్షుడిగా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఎందుకో గాని గ‌త ఎన్నిక‌ల్లో గెలిచాక మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో బాల‌రాజులో నిర్వ‌దం అలుముకుంది. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆయ‌న ప‌ట్టీప‌ట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించార‌ని వైసీపీ నేత‌లు చెపుతూ ఉంటారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కేడ‌ర్‌తో పాటు క‌నీసం అభివృద్ధి విష‌యంలోనూ ఆయ‌న పూర్తి నిర్ల‌క్ష్యంగా ఉన్న‌ట్టే చెపుతున్నారు.

ఏజెన్సీ నియోజ‌క‌వ‌ర్గం అయిన పోల‌వ‌రంలో తెలుగుదేశం పార్టీ హ‌యాంలో జ‌రిగిన డెవ‌ల‌ప్‌మెంట్ మిన‌హా కొత్త డ‌వ‌ల‌ప్‌మెంట్ లేదు. ఈ క్ర‌మంలోనే రెండు మూడు స‌ర్వే నివేదిక‌ల్లోనూ ఆయ‌న‌కు నెగ‌టివిటి బాగా ఎక్కువుగా ఉన్న‌ట్టు రిపోర్టులు రావ‌డంతో ముందే అప్ర‌మ‌త్తం కావాల‌ని.. చివ‌రి వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి ఉంటే తానేమి చేయలేన‌ని చెప్పేసిన‌ట్టు తెలుస్తోంది.

తాజాగా జ‌రిగిన స‌మావేశాల్లో బాల‌రాజుతో పాటు జ‌గ్గంపేట జ్యోతుల చంటిబాబు, జ‌గ్గ‌య్య‌పేట సామినేని ఉద‌య‌భాను, పొన్నూరు కిలారో రోశ‌య్య‌, నెల్లూరు సిటీ అనిల్‌కుమార్ యాద‌వ్ పేర్లు ఉన్నాయి. వీరు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశాల‌ను ప‌ట్టించుకోకుండా అస‌లే మాత్రం జ‌నం వ‌ద్ద‌కు వెళ్ల‌లేద‌ని నివేదిక‌లు వెళ్లాయంటున్నారు.