పవర్స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా నటించిన ప్రణీత టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ‘ ఏం పిల్లో ఏం పిల్లడో ‘ సినిమాతో టాలీవుడ్కి ఏంట్రి ఇచ్చిన ప్రణీత తర్వాత తన వాలు కళ్ళు, అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. బావ, రభస, డైనమైట్, అత్తారింటికి దారేది ఇలా ఎన్నో హిట్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో బిజినెస్ మాన్ నితిన్ రాజును వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది.
గత ఏడాది ఒక పాపకు జన్మనిచ్చిన ప్రణీత సినిమాలకి దూరంగా ఉన్న సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్కి టచ్ లోనే ఉంటుంది. తాజాగా ప్రణిత తన భర్తకు పాద పూజ చేస్తూ ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది ఆమెపై ట్రోల్స్ చేస్తూ.. నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటివారికి ప్రణీత ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
గత సంవత్సరం నేను ఇదే విధంగా పూజ చేశాను.. ఆ ఫొటోలతో మీమ్ పేజీలలో అనేక రకాలుగా చర్చలు జరిపారు. ఈరోజు ఉదయం భీమన అమావాస్య సందర్భంగా పూజ చేశాను. ఇది మీకు పితృ సౌమ్య ప్రదర్శన కావచ్చు కానీ నాకు ఇది గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఆచారం. సనాతన ధర్మంలో చాలా ఆచారాలు ఎందుకు ? ముఖ్యమైనవి అని చెప్పడానికి ఓ కథ ఉందని చెప్పింది.
హిందూ ఆచారాలు పితృ సౌమ్యమైనవని వాదించడం పూర్తిగా నిరాధారమైనది. ఎందుకంటే ? దేవతలను సమానంగా పూజించే కొన్ని విశ్వాసాలలో ఈ పూజ కూడా ఒకటి… భీమన అమావాస్య కన్నడ నెల ఆషాడంలో చంద్రుడు లేని రోజు అంటే అమావాస్య నాడు జరుపుకుంటారు. అక్కడ మహిళలు తమ భర్త, సోదరుల క్షేమం గురించి ఈ పూజను చేస్తారు. ఈ ఆచారాన్ని దీపస్తంభ పూజ అని కూడా అంటారు. పులునాడుకు ఇది పెద్ద పండుగ. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాలో భీమన అమావస్యను చాలామంది జరుపుకుంటారని ఆమె తెలిపింది.