మ‌హాన‌టి సావిత్రి ఆస్తులు కొట్టేసిన వారిలో ఓ హీరోయిన్ కూడా ఉందా… !

మ‌హాన‌టి సావిత్రి గురించి ఎంత త‌క్కువ చెప్పుకొన్నా.. ఆమె గురించి ఎక్కువ‌గానే కొత్త సంగ‌తులు ఎప్ప టికప్పుడు వినిపిస్తుంటాయి. మ‌హాన‌టిగానే తెలుగు సినిమా ప్ర‌పంచంలో త‌నకంటూ ప్ర‌త్యేక స్థానం సం పాయించుకున్న సావిత్రి.. బాగానే సంపాయించుకున్నారు. అయితే.. పెద్ద‌గా చ‌దువు లేక‌పోవ‌డంతో సావిత్రి ఆస్తులు, ఆదాయాల‌పై లెక్క‌లు వేసుకునేవారు కాదు.The sweet and sour real life romance of reel actors Savitri and Gemini | Daily FT

ఈ బాధ్య‌త అంతా కూడా.. సావిత్రి భ‌ర్త చూసుకునేవారు. అయితే.. ఆయ‌న‌తో పాటు.. సావిత్రి ఆస్తుల చిట్టా ల‌న్నీ అప్ప‌టి న‌వ‌త‌రం న‌టి మ‌ధుమిత అని ఆమె కూడా చూసేవారు. ఈమె తెలుగు సినిమాల్లో న‌టించ లేదు. త‌మిళ సినిమాల్లో మాత్రం సెకండ్ హీరోయిన్‌గా న‌టించేవారు. ఇలా.. సావిత్రి స‌ర‌స‌న న‌టించిన మ‌ధుమిత‌.. త‌ర్వాత కాలంలో హీరోయిన్‌గా ఎదిగారు.

ఈ ప‌రిచ‌యంతోనే సావిత్రి త‌న ఆస్తుల లెక్క‌లు చూసిపెట్టాల‌ని.. మ‌ధుమిత‌ను కోర‌డంతో… దాదాపు 5 సంవ‌త్స‌రాల పాటు మ‌ధుమిత‌.. సావిత్రి ఆస్తుల లెక్క‌లు చూశారు. అయితే.. తొలి రెండేళ్లు బాగానే ఉన్నా.. త‌ర్వాత త‌ర్వాత జెమినీ గ‌ణేష‌న్‌తో సావిత్రికి విభేదాలు రావ‌డం.. ఆయ‌న నుంచి దూరంగా ఉండ‌డం.. వివాదాలు ముదిరి.. సావిత్రి ఆరోగ్యం చెడిపోవ‌డం వంటివి తెలిసిందే.

MahanatiSavitri on Twitter: "#Savitri ma bungalow in ...

ఈ స‌మ‌యంలోనే మ‌ధుమిత‌.. త‌న హ‌స్త‌లాఘ‌వాన్ని ప్రద‌ర్శించి.. సావిత్రి ఆస్తుల్లో కొంత‌మేర‌కు.. త‌న ఖాతాల్లోకి మళ్లించుకున్నార‌నేది సావిత్రి కుటుంబం చేస్తున్న ఆరోప‌ణ‌. ముఖ్యంగా చెన్నై టీ న‌గ‌ర్‌లో ఉన్న ఓ భ‌వ‌నంలో కొంత భాగాన్ని మ‌ధుమిత కొన్న‌ట్టుగా రికార్డులు సృష్టించార‌ని వీరు ఆరోపిస్తున్నారు. కొన్నాళ్లు.. కోర్టు వివాదాల‌తోనూ కాలం ముగిసింది. కానీ, ఇప్ప‌టికీ.. ఈ లెక్కలు మాత్రం అస్ప‌ష్టంగానే ఉన్నాయి.