5 సార్లు వ‌రుస‌ ఓట‌మి త‌ర్వాత ఆ టీడీపీ నేత విక్ట‌రీ కొట్ట‌బోతున్నాడా..!

మొదటిసారి ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో సీన్ మారుతుంది. ఇంతకాలం వైసీపీకి అనుకూలంగా నడిచిన రాజకీయం ఇప్పుడుప్పుడే రివర్స్ అవుతుంది. రాష్ట్రంలో టి‌డి‌పి గాలి మొదలవుతున్న నేపథ్యంలో సర్వేపల్లిలో కూడా టి‌డి‌పికి పట్టు పెరుగుతుంది. చాలా కాలం నుంచి ఇక్కడ టి‌డి‌పి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయాలకు దూరమయ్యారు. ఎప్పుడో 1994, 1999 ఎన్నికల్లోనే సోమిరెడ్డి అక్కడ గెలిచారు.

 

ఇక 2004, Somireddy Chandramohan Reddy to contest from Sarvepalli, resigns MLC post2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. మరి ఎందుకో సర్వేపల్లి ప్రజలు సోమిరెడ్డి వైపు చూడటలేదు 2014లో ఎమ్మెల్సీ అయి, మంత్రిగా సర్వేపల్లిలో మంచిగానే అభివృద్ధి చేశారు. అయినా సరే ప్రజలు కాకాని గోవర్ధన్ రెడ్డిని గెలిపించారు. కాకాని ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. అయినా సర్వేపల్లికి ఒరిగేది ఏమి లేదు. పైగా అక్రమాలు పెరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటు సోమిరెడ్డి ఇదే చివరి ప్రయత్నం అన్నట్లు పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో సర్వేపల్లిలో రాజకీయం మారుతుంది. సోమిరెడ్డిపై ప్రజల్లో సానుభూతి వస్తుంది.

దీంతో ఈ సారి సర్వేపల్లిలో ఊహించని ఫలితం వచ్చేలా ఉంది. అయితే సోమిరెడ్డికి రాజకీయంగా దురదృష్టం ఈ సారి పోతుందనే టి‌డి‌పి శ్రేణులు భావిస్తున్నాయి. కాకపోతే మొన్నటివరకు సర్వేపల్లిలో వైసీపీకే ఎడ్జ్ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువ ఉంటుంది..రెడ్డి వర్గం వైసీపీకి అండగా ఉంది. ఇటు సోమిరెడ్డి అదే వర్గమైన..వైసీపీపై అభిమానంతో వారు..కాకాని వైపు ఉంటున్నారు.

Revolutionary changes visible in agri sector: Kakani Govardhan Reddy

కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక రెడ్డి వర్గానికి కూడా ఒరిగింది ఏమి లేదు..ఏదో పదవుల్లో ఉన్నవారు మాత్రం లబ్ది పొందారు..సామాన్య రెడ్డి వర్గానికి పెద్దగా ఏమి జరగలేదు. దీంతో వారిలో కూడా అసంతృప్తి ఉంది. ఈ పరిణామాల క్రమంలో మొదటిసారి కాకానికి ఓటమి టెన్షన్ పట్టుకున్నట్లు కనిపిస్తుంది..అందుకే రాజకీయంగా సోమిరెడ్డిని తొక్కడానికే చూస్తున్నారు. కానీ అదే సోమిరెడ్డికి ప్లస్ అవుతుంది. మొత్తానికి చూసుకుంటే సర్వేపల్లిలో సోమిరెడ్డికి నిదానంగా పట్టు పెరుగుతుందనే చెప్పాలి.