యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అదే క్రేజ్ను కంటిన్యూ చేస్తూ టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల శివతో తన 30వ సినిమా దేవర చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో భారీ అంచనాలు పెంచేసాడు తారక్. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే. మన టాలీవుడ్ లో ప్లాప్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ కెరీర్ లో మాత్రం హిట్ టాక్ తెచ్చుకుని ప్లాప్ ఆయన సినిమా ఒకటి ఉంది. అలా ప్లాప్ అయిన సినిమా ఏంటో ఒకసారి చూద్దాం. అలా ప్లాప్ అయిన సినిమా మరేదో కాదు ఎన్టీఆర్- కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన రాఖి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా ఇలియానా, చార్మి నటించారు.
చెల్లి సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కే ఎల్ నారాయణ నిర్మించారు. ఈ సినిమా2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వరుసగా ఐదు డిజాస్టర్ లను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఆ సమయంలోనే రాఖీ సినిమా చేశాడు. అయితే ఈ సినిమా విడుదలైన తొలి షో నుంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అవ్వలేకపోయింది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం సినిమాని.. ఈ సినిమా కూడా ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమా విడుదలైన కొద్దిరోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
హిట్ టాక్ తెచ్చుకున్న రాఖీ సినిమా బాక్సాఫీస్ వద్ద వీక్ అవుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం సినిమా వచ్చింది. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం బాగా వచ్చాయి. ఈ రెండు సినిమాల నేపథ్యం కూడా సిస్టర్ సెంటిమెంట్. దీంతో రాఖీ సినిమా చూడాలనుకున్నవారు కూడా అన్నవరం సినిమా చూడడంతో ఎన్టీఆర్ సినిమాకు నష్టాలు తప్పలేదు. యావరేజ్ టాక్ తో కూడా అన్నవరం ఆ రోజుల్లో రూ.21 కోట్లు పైగా కలెక్షన్ సాధించింది. హీట్ టాక్ తెచ్చుకున్న రాఖీ సినిమా మాత్రం కేవలం రూ.13 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక దీంతో ఈ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ప్లఫ్ గా మిగిలిపోయింది.