సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్పి బాగా ఫేమస్ అయిన ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. గతంలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో ఆశ్చర్యమైన విషయాలను చెప్పి వార్తలో నిలిచారు వేణు స్వామి. అయితే చాలా వరకు వేణు స్వామి చెప్పిన విషయాలు నిజమయ్యాయి. సమంత, నాగచైతన్య విడిపోతారని వారి పెళ్లికి ముందే వేణు స్వామి చెప్పారు. అలానే మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ జాతకం కూడా ఆమె బాబాయ్ పవన్ కళ్యాణ్ లానే మూడు పెళ్లిళ్లు ఉన్నాయని వేణు స్వామి చెప్పారు.
అలాగే ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ఉన్న రష్మిక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాతే ఆమె కెరీర్ బాగుంటుందనే విషయం కూడా తనే చెప్పినట్లు వేణు స్వామి ఒక ఇంటర్వ్యూలో అన్నారు. గతంలో రష్మిక ఇంట్లో కొన్ని పూజలు కూడా వేణు స్వామి చేసినట్లు స్వయంగా ఆయనే చెప్పారు. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ ఓ ఇద్దరు స్టార్ హీరోలు చనిపోతారని చెప్తున్నారు.
వారిలో ఒకరు అనారోగ్యంతో చనిపోతే, మరొకరేమో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతారని చెప్తున్నారు. అలానే ఇంకో స్టార్ హీరోయిన్ కూడా అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడుతుందని అంటున్నారు. అయితే వేణు స్వామి ఆ హీరో హీరోయిన్ల పేర్లు డైరెక్ట్గా చెప్పకుండా, వారి రాశుల పేర్లు చెప్తున్నారు. మీన రాశి, వృశ్చిక రాశి గల స్టార్ హీరోలు ఇద్దరు చనిపోతారట. అయితే ఇప్పటికే తారక రత్న అనారోగ్యంతో మరణించాడు.
ఇక స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తారక్ రత్న కాకుండా 2026లోపు మరో ఇద్దరు స్టార్ హీరోలు మరణిస్తారని వేణు స్వామి గట్టిగా చెప్తున్నారు. ఇప్పటికే ఆయన చెప్పిన విషయాలు కాస్త ఆలస్యంగా అయినా కూడా చాలా జరిగాయి. అవగాహన లేని కొంతమంది ఆయన గురించి తప్పుగా ప్రచారం చేస్తూ, ట్రోలింగ్ చేస్తున్నారు అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు.