పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అటు దర్శకుడుగా రాజమౌళికి, హీరోగా ఎన్టీఆర్ కి కూడా ఇది తొలి విజయం. ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన కూడా వచ్చింది. ఇదే సమయంలో ఈ సూపర్ హిట్ సినిమాకి ముందుగా అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదట.
మరో స్టార్ హీరో అని అనుకున్నారట. రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నిర్మాత అశ్విని దత్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా కోసం ముందుగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ను అనుకున్నారట. దివంగత నటుడు హరికృష్ణ తన కుమారుని ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ చేయాలని కోరాడంతో తమ నిర్ణయం మార్చుకున్నారట అశ్వినీ దత్.
దీంతో తారక్ ఈ హీరోగా ఎంపికయ్యారని చెప్పారు. మేమందరం అనుకున్న దానికన్నా ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటించారని తెలిపారు. ఆ తర్వాత 2002లో ఈశ్వర్ సినిమాతో ఈ ప్రభాస్ ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసాం. అయితే 2001 లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ విషయం మరోసారి వైరల్ కావడంతో స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో ప్రభాస్ నటించి ఉంటే మరోలా ఉండేది అంటూ ప్రభాస్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.