అన్నగారు ఎన్టీఆర్ స్వతహాగా.. ఆహార ప్రియులు. ఇంటి నుంచే కాకుండా.. ఆయనకు నచ్చిన ఉడిపి హోటల్ నుంచి కూడా క్యారేజీ తెప్పించుకుని తినేవారు. ఒక సమయంలో అయితే.. ఆటోలో రెండు క్యారేజీలు షూటింగ్ స్పాట్కు వచ్చాయి. దీంతో అందరూ.. ఎన్టీఆర్.. మనందరికీ భోజనం తెప్పించారని అనుకున్నారు. కానీ, తీరా చూసేసరికి అన్నీ ఆయనకే అని అసిస్టెంట్ చెప్పడంతో నోరెళ్ల బెట్టారు. ఆహార పుష్ఠి ఎక్కువగా ఉన్న నటుల్లో ఎన్టీఆర్ ఒకరు.
ముఖ్యంగా మాంసాహారానికి ఎక్కువగా అన్నగారు ప్రాధాన్యం ఇచ్చేవారు. నాటుకోడి పులుసు, వేపుడు ఇ లా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల ఆహారం కూడా ఆయనకు చాలా ప్రీతి పాత్రం వండిపెట్టేవారు. ఇక, హీరోయిన్లలో అన్నగారికి సమ ఉజ్జీ అన్న రీతిలో సావిత్రి వ్యవహరించేవారు. ఆమె కూడా ఆహార ప్రియురా లు. తను స్వయంగా వండుకుని.. తినేవారు. అలానే షూటింగ్ స్పాట్లకు కూడా తీసుకువచ్చేవారు. సావిత్రి ఎక్కువగా పీతలతో చేసిన డిషెస్ను తినేవారు.
మచిలీపట్నంలో దొరిగే సముద్ర పీతలంటే.. సావిత్రికి మహాఇష్టం. ఇక, ఆమె అన్నగారు ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమాల్లో ఇద్దరూ కలిసి భోజనం చేసేవారు. ఈ సమయంలోనే సావిత్రి పీతలతో వండిన రెండు మూడు రకాల డిషెస్ తీసుకువచ్చేవారు. ముఖ్యంగా పీతల ఫ్రై, పీతల పులుసు ప్రధానంగా ఉండేది. అన్నగారు అయితే.. వీటిని ఎగబడి మరీ తినేవారట. అయితే.. పీతలతో భోజనం అంటే.. రెండు గంటలైనా పడుతుందని షూటింగును ముందుగానే పూర్తి చేసుకుని భోజనాల దగ్గర కూర్చునేవారట.