టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో రష్మిక మందన్నా కూడా ఒకరు. ప్రస్తుతం నేషనల్ క్రష్గా మారిన ఈ ముద్దుగుమ్మ.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాతో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. హిట్, ప్లాప్లతో సంబంధం లేకుండా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది.
టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్కు జంటగా పుష్ప2 సినిమా షూటింగ్లో నటిస్తుంది. ఆలాగే బాలీవుడ్లో రణబీర్ కపూర్ కు జంటగా యానిమల్ సినిమా చేస్తుంది. వీటితోపాటు రెయిన్ బో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాను కూడా లైన్ లో పెట్టింది. రష్మిక సినిమాల విషయం పక్కనపెడితే.. ఈమె పర్సనల్ లైఫ్ గురించి మాక్సిమం అందరికీ తెలిసిందే. ముందుగా కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన కిరాక్ పార్టీ సినిమాతోనే హీరోయిన్గా తన కెరీర్ను ప్రారంభించింది.
ఈ సినిమా సమయంలోనే రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. అదేవిధంగా అతడితో ఏడడుగులు నడవాలని కూడా భావించింది. ఇరు కుటుంబసభ్యులు సైతం వీరి ప్రేమను అంగీకరించి ఘనంగా వీరికి నిశ్చితార్థం కూడా జరిపించారు. 2017లో వీరి ఎంగేజ్మెంట్ ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లి వరకు వెళతారు అనుకున్నా రష్మిక రక్షిత్ శెట్టి మధ్యలోనే బ్రేకప్ అయిపోయారు. ఎంగేజ్మెంట్ జరిగిన కొద్దిరోజులకే రష్మిక- రక్షిత్ శెట్టి కు గుడ్ బై చెప్పి టాలీవుడ్కు వచ్చేసింది. ఇదే విషయం కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసింది కూడా.. పైగా రక్షిత్ శెట్టితో విడిపోయాక రష్మిక కెరీర్ కూడా అమాంతం ఎవరూ ఊహించని స్థాయికి వెళ్ళింది.
ఇదే సమయంలో రష్మిక- రక్షిత్ శెట్టి విడిపోవడంపై గతంలో టాలీవుడ్ సెలబ్రిటీ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పలు షాకింగ్ విషయాలు కూడా బయట పెట్టాడు. రష్మిక కి రక్షిత శెట్టితో నిశ్చితార్థం జరిగిన తర్వాత ఇద్దరి జాతకాలు చూస్తే అవి అసలు మ్యాచ్ అవ్వలేదని వేణు స్వామి చెప్పకోచ్చారు. ఒకవేళ వీరిద్దరూ పెళ్లి చేసుకున్న ఎక్కువ కాలం కలిసి ఉండలేరని, అదేవిధంగా రక్షిత్ శెట్టి ను రష్మిక పెళ్లి చేసుకుంటే ఆమె కెరీర్ కూడా నాశనం అయ్యేదని.. వేణు స్వామి చెప్పుకొచ్చాడు. అందుకే రష్మికను ఈ పెళ్లిని రద్దు చేసుకోమని చెప్పాను .. రష్మిక కూడా నేను చెప్పిన మాటలు బాగా ఆలోచించి అతనితో విడిపోయిందని వేణు స్వామి వెల్లడించారు. వేణు స్వామి చెప్పడం వల్ల రష్మిక- రక్షిత్ శెట్టితో బ్రేకప్ చేసుకుందా లేక మరొక ఏదైనా కారణం ఉందా అనేది మాత్రం ఆమెకే తెలియాలి..!!