టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన జేడీ చక్రవర్తి గురించి ఈ తరం వారికి తెలియకపోవచ్చు. కానీ ఆ తరం వారందరికీ అతడు సుపరిచితుడే. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న చక్రవర్తి మొదట రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ‘ శివ ‘ సినిమాతో కెరీర్ని స్టార్ట్ చేశాడు. ఇటీవల పవన్ సాధినేని డైరెక్షన్లో రూపొందించిన ‘ దయ ‘ వెబ్ సిరీస్ లో మెయిన్ రోల్ ప్లే చేశాడు.,
ఈ వెబ్ సిరీస్ లో ఈషా రెబ్బ, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, కమల్ కామరాజ్ కీ రోల్ ప్లే చేశారు. ఇక తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జేడీ చక్రవర్తి పాత సీక్రెట్లు బయటకు వచ్చాయి. ఈవెంట్ లో జెడి చక్రవర్తితో పాటు డైరెక్టర్ కృష్ణవంశీ అలాగే జెడి స్నేహితుడు ఉత్తేజ్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తేజ్ మాట్లాడుతూ చక్రవర్తి గురించి పలు ఆసక్తికర విషయాలని వివరించాడు.
మేమిద్దరం చాలా ఏళ్ల క్రితం కలిసి పంజాగుట్ట దగ్గర అర్ధరాత్రి సమయంలో హీరోయిన్ రంభ తొడలు చూడడానికి వెళ్లిన బ్యాచ్ అని.. అక్కడ ఓ సినిమా కోసం రంభ కటౌట్ చాలా పెద్దది పెట్టారని.. అబ్బా ఏముందిరా రంభ అని కారులో వెళ్లి మరి చూసి వచ్చే వాళ్ళమని.. తర్వాత అదే రంభతో బొంబాయి ప్రియుడు సినిమాలో హీరోగా చేసిన ఫ్రెండ్ జె.డి చక్రవర్తి అంటూ ఉత్తేజ్ తమ లైఫ్లో నాటి ఫన్నీ ఇన్సిడెంట్ వివరించాడు.
జెడి చక్రవర్తికి సినిమాలంటే పిచ్చి.. దర్శకత్వం పేరుతో రూటు మార్చి అలా మిగిలిపోయాడు కానీ.. లేదంటే టాప్ హీరోల్లో ఒకడిగా ఉండేవాడని ఉత్తేజ్ చెప్పాడు. జేడీ టాలీవుడ్ అమీర్ఖాన్ అని ప్రశంసించాడు ఉత్తేజ్. అతనికి సినిమా నాలెడ్జ్ చాలా ఎక్కువని ఏ సినిమా గురించైనా నిద్రలో అడిగిన సరే సినిమా యాక్టర్లు, కొరియోగ్రాఫర్లు, దర్శకులతో సహా పొల్లు పోకుండా చెపుతాడని తెలిపాడు. ఉత్తేజ్ మాటలకు ఆ ఈవెంట్ లో పాల్గొన్న వాళ్లు సరదాగా ఎంజాయ్ చేశారు.