ఒక్క పోస్ట్ లేకుండానే ఇన్స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించాడు పవర్స్టార్ పవన్ కళ్యాణ్. అలాంటిది ఇప్పుడు ఒక పోస్ట్ అప్లోడ్ చేశాడో లేదో దుమ్ము దులిపేస్తోంది. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఇవే అంటూ ఒక వీడియో అప్లోడ్ చేశారు. దాంట్లో కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్ల ఫోటోలు కూడా ఉన్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ ఇంకా సీనియర్ హీరోలు, హీరోయిన్లు ఉన్నారు.
మన బంధం ఇలానే కొనసాగాలని.. మరెన్నో మధురమైన జ్ఞాపకాలు పంచుకోవాలని ఆశిస్తున్నానని ఇన్స్టాలో ఫస్ట్ పోస్ట్ అప్లోడ్ చేశాడు. ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీ మీద ఎంత గొప్ప అభిప్రాయం ఉందో అని పలువురు పవన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఈ పోస్ట్ అలా అప్లోడ్ అయ్యిందో లేదో వెంటనే లైకులు, కామెంట్ల వర్షం కురిపించారు.
పవన్ తన ఇన్స్టాలో ఫస్ట్ పోస్ట్ రాజకీయం గురించి పెడతాడని ఆశించాం.. కానీ రాజకీయం కంటే సినిమా ఇండస్ట్రీ మీద ఇష్టంతో హీరో, హీరోయిన్స్, సీనియర్ హీరోస్ వీడియో అప్లోడ్ చేశారు. పవన్ ఇకపై తరచూ ఇన్స్టాలో పోస్టులతో తన ఫాలోవర్లకు ఎప్పటికప్పుడు టచ్లో ఉంటాడని తెలుస్తోంది.
View this post on Instagram