ఎన్టీఆర్‌కు ఆ హీరోయిన్ అంటే అంత ప్రేమ.. ఆమె కోసం అలా చేశాడా..? ఎన్టీఆర్ వైఫ్ కూడా షాక్ అయిపోయిందిగా..!!

చిత్ర పరిశ్రమలో ఉండేవారికి ఒక్కో హీరో, ఒక్కో హీరోయిన్ ఇష్టం ఉంటుంది. సినిమాలు చూసే ప్రేక్షకులకు కూడా ఒకే హీరోయిన్, ఒకే హీరో ఇష్టం ఉండాలని రూల్ ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక్కో జోనర్లో సినిమాలు చేసే హీరోలంటే ఇష్టం. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాత్రం మహానటి సావిత్రి తర్వాత ఇష్టమైన ఏకైక హీరోయిన్ ఎవరంటే జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్‌కు సెకండ్ హీరోయిన్‌గా నటించిన నిత్యామీనన్ అని చెబుతూ ఉంటారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం ఏర్పడిందని అంటారు.. ఇదే సమయంలో జనతా గ్యారేజ్ లో నిత్య మీనన్ తో పాటు సమంత కూడా నటించింది. అప్పటికే ఎన్టీఆర్- సమంతతో బృందావనం సినిమా చేశాడు. అయితే నిత్యమీన‌న్‌ తో మాత్రం తొలిసారిగా ఎన్టీఆర్ నటించడంతో వీరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. అంతేకాకుండా నిత్యమీనన్ ఈ సినిమాలో ఎంతో నేచురల్ గా నటించింది అంటూ ఎన్టీఆర్ ఆ సినిమా ప్రమోషన్ లో కూడా చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా వీరికి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా గతంలో ఎంతో వైరల్ గా కూడా మారింది. ఈ సినిమాని కాకుండా మరో ఏ సినిమాలో అయినా నిత్యమీనన్‌తో నటించే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా అవకాశాన్ని వదులుకోనని.. మహానటి సావిత్రి గారి తర్వాత నాకు అంతలా నచ్చిన హీరోయిన్ నిత్య మీనన్ అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఆ స‌మ‌యంలో సమంత కూడా ఎన్టీఆర్‌ ను ఆటపట్టించిన వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఎన్టీఆర్‌ ఏ హీరోయిన్ తో ఇప్ప‌టి వ‌ర‌కు అంత చనువుగా ఉన్న‌ది లేదు. ఒక కేవలం నిత్యామీనన్ పై అంత పాజిటివ్‌గా ఉంటూ అలాంటి కామెంట్స్ చేయడంతో అతని భార్య లక్ష్మి ప్రణతి సైతం ఇక‌సారిగా షాక్ అయిందని ..లక్ష్మీ ప్రణతి దగ్గర కూడా నిత్యామీనన్ నటన గురించి చాలా గొప్పగా పొగడారని తెలుస్తుంది. అలాంటి ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో ఆయన నిత్య మీనన్‌తో మరో సినిమాల్లో నటిస్తాడో లేదో చూడాలి.