తెలుగు రాష్ట్రాలలో కోటి కంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు నివశించే ఏకైక మహానగరం హైదరాబాద్ అనే సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఏదైనా వ్యాపారం చేసి ఆ వ్యాపారం క్లిక్ అయితే కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ రీజన్ వల్లే స్టార్ హీరోలు సైతం హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరో మహేష్ బాబు అత్యాధునిక హంగులతో గచ్చిబౌలిలో ఏఎంబీ మల్టీప్లెక్స్ ను నిర్మించిన సంగతి తెలిసిందే.
ఈ మల్టీప్లెక్స్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉండటంతో పాటు ఈ మల్టీప్లెక్స్ లో సినిమాలకు సంబంధించిన ప్రీమియర్ షోలు వేస్తున్నారు. అదే సమయంలో సినిమాలకు సంబంధించిన చిన్నచిన్న ఈవెంట్లు సైతం ఈ మల్టీప్లెక్స్ లో జరుగుతుండటం గమనార్హం. అయితే ఈ మల్టీప్లెక్స్ కు పోటీగా స్టార్ హీరో అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్ పేరుతో అమీర్ పేట్ లో మల్టీప్లెక్స్ ను నిర్మించడం జరిగింది.
సాధారణంగా ఎవరైనా కొత్తగా నిర్మించిన ఏఏఏ సినిమాస్ ఏఎంబీ సినిమాస్ తో పోల్చి చూస్తే అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే గత రెండేళ్లలో టెక్నాలజీకి సంబంధించి కీలక మార్పులు వచ్చాయి. అయితే విచిత్రం ఏంటంటే ఏఏఏ మల్టీప్లెక్స్ కూడా బాగానే ఉన్నా ఏఎంబీ సినిమాస్ ఒక మెట్టు పైన ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ రెండు మల్టీప్లెక్స్ లలో సినిమాలను చూసిన వాళ్లు ఈ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.
ఏఏఏ సినిమాస్ లో ఉండే ఎల్.ఈ.డీ లైట్ల ఫోకస్ కళ్లకు ఇబ్బంది కలిగించే విధంగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే చిన్నచిన్న లోపాలను అధిగమిస్తే మాత్రం ఏఏఏ సినిమాస్ కు తిరుగుండదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అమీర్ పేట్ లో నిర్మించడం ఏఏఏ సినిమాస్ కు ప్లస్ అవుతోంది. రాబోయే రోజుల్లో ఈ రెండు మల్టీప్లెక్స్ లలో ఏ మల్టీప్లెక్స్ పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.