విజయా బ్యానర్పై వచ్చిన కుటుంబ కథా సినిమాల్లో తిరుగులేని మేటి చిత్రంగా నిలిచింది.. గుండమ్మకథ. ఈ సినిమా మల్టీ స్టారర్ మూవీలకు పునాదులు వేసిందనే చెప్పాలి. అన్నగారు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు కలిసి అన్నదమ్ములుగా అనేక సినిమాల్లో నటించారు. అయితే.. ఈ సినిమాలో వచ్చిన పేరు మాత్రం ఇతర సినిమాల్లో వారు రాబట్టుకోలేక పోయారు. ఇక, ఈ సినిమాలో పాత్రలు తారుమారయ్యాయనే విషయం చాలా మందికి తెలియదు.
తొలుత ఎన్టీఆర్ పోషించిన పాత్రను అక్కినేనితో నటించేలా చేశారు. మొదటి రెండు షెడ్యూళ్లు కూడా పూర్తయ్యాయి. కానీ, ఎందుకో దర్శకుడు ఎల్వీ ప్రసాద్కు నచ్చలేదు. దీంతో పాత్రలను తారుమారు చేసి.. అప్పటికే ఖర్చు చేసిన రూ.10 వేలను కూడా తానే భరించి.. అక్కినేని పాత్రను అన్నగారితోనూ.. ఎన్టీఆర్ పాత్రను అక్కినేనితోనూ వేయించారు. ఇది ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
ఇక, ఎస్వీ రంగారావు పోషించిన పాత్రకు తొలుతు గుమ్మడి వెంకటేశ్వరరావును అనుకున్నారు. కానీ, ఆయన కాల్షీట్లు దొరకలేదు. దీంతో ఎస్వీ రంగారావును తీసుకున్నారు. అదేవిధంగా సావిత్రి నటించిన పాత్రను తొలుత భానుమతిని దృష్టి లో పెట్టుకుని చేశారు. అయితే.. ఆమె తొలుత అంగీకరించినా.. తర్వాత.. ఎందుకో కాదన్నారు. దీంతో చివరి నిముషంలో సావిత్రిని ఎంపిక చేసుకున్నారు.
ఇక, జమున పాత్ర కూడా తొలినాళ్లలో అంటే.. మొదటి రెండు రోజుల షూటింగులను గీతాంజలితో చేశారు. కానీ, ఆమెలో అమాయకత్వం.. అహంకారం కలగలిపిన అభినయం దక్కలేదు. దీంతో ఆమెను మార్చి గీతాంజలిని ఎంచుకున్నారు. ఇలా.. గుండమ్మ కథలో అనేక మార్పులు జరిగాయి.