మహానటి, దర్శకురాలు, గాయకురాలు.. భానుమరీ రామకృష్ణ గురించి చాలా మందికి తెలిసింది.. ఆమె గయ్యాళి అని. ముక్కుమీదే కోపం ఉంటుందని. ఎవరనీ పడనివ్వరని పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ఆమె తో నటించేందుకు చాలా మంది నటులు కూడా ఇబ్బంది పడేవారు. ఎక్కువ మంది నాయకులు తప్పుకొ న్నారు కూడా! అమ్మో.. అనే మాట తరచుగా వినిపించేది. నిజానికి చెప్పాలంటే.. భానుమతి ఎంపికే డిఫ రెంట్.
ఆమె తనకు నచ్చినట్టుగానే ఉంటానని.. నచ్చినట్టే చేస్తానని చెప్పే ఘటం. ప్రతి సినిమాలోనూ తన పాట ఉండాల్సిందే. తనకు ప్రధాన పాత్రలు దక్కాల్సిందే. ఈ ధోరణి దర్శకులకు, భానుమతికి మధ్య కూడా గ్యాప్ ను పెంచింది. ఇక, సంగీత దర్శకులకు కూడా ఆమె ఒక పట్టాన అంతు చిక్కేది కాదనే టాక్ నడిచిం ది. ఎవరు చెప్పినా ఆవిడ వినదు.. ఆమె చెప్పినట్టే నడుచుకోవాలి.. అనే మాట ఎక్కువగా వినిపించేంది.
నందమూరి బాలకృష్ణ, సుహాసిని కలిసి నటించిన `మంగమ్మగారి మనవడు` సినిమాలో టైటిల్ రోల్ పోషించారు భానుమతి. ఈ సినిమాలోకి వచ్చేసరికి వృద్ధురాలి పాత్రను ధరించారు. అయితే.. ఇక్కడ కూడా పట్టే. తనకు ఒక పాట పెట్టాల్సిందేనని పట్టు. దర్శకుడు కోడి రామకృష్ణ ఎంతో బ్రతిమాలి ఆమెను ఈ సినిమాకు ఒప్పించారు. పాట పెట్టారు `శ్రీసూర్యనారాయణా మేలుకో` అనే పాట ఇది. హిట్టయింది. సరే.. ఇంత పెంకిగా.. వ్యవహరించిన భానుమతిలో మరో కోణం లేదా? అనేది ప్రశ్న.
అంటే.. ఉందనే అనేవారు అప్పటి నిర్మాతలు. మొదట్లో పట్టుబట్టి తన రెమ్యునరేషన్ మాట్లాడుకునేవార ట భానుమతి. కొంత అడ్వాన్సుగా తీసుకునేవారట. తర్వాత.. నిర్మాత కొంత మొత్తం తగ్గించి.. అమ్మా అనుకోకుండా ఖర్చు పెరిగిందనో.. నష్టాలు వచ్చాయనో.. చెబితే.. సరేలే.. అంటూ.. మిగిలిన మొత్తం వదులుకునేవారట. ఇక, చైనా యుద్ధం సమయంలో(శాస్త్రి పీఎంగా ఉన్నప్పుడు) ఇండస్ట్రీ కష్టాల్లో ఉంటే.. భరణి స్టూడియోలోనే కార్మికులకు రోజూ భోజనాలు పెట్టారు. ఇలా.. భానుమతిలో కనిపించని కోణాలు చాలానే ఉన్నాయి.