అబద్దాలు చెప్పి..అవే నిజాలు అని నమ్మించి రాజకీయంగా లబ్ది పొందడంలో జగన్ని మించిన వారు లేరనే చెప్పాలి. గత ఎన్నికల ముందు చంద్రబాబు గురించి ఎన్ని రకాలుగా అబద్దాలు ప్రచారం చేశారో అందరికీ తెలిసిందే. వాటిని ప్రజలు నమ్మారు ఓట్లు వేసి గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చాక కూడా జగన్ అదే తరహాలో అబద్దాలు చెబుతూ ముందుకెళుతున్నారు. ఉదాహరణకు ఆయనకు సొంత మీడియా, పత్రిక లేకపోవడం అని చెప్పడం..అయితే పదే పదే ప్రజలు మోసపోవడానికి రెడీగా లేరనే చెప్పాలి.
గత ఎన్నికల్లో వివేకాని చంపించింది చంద్రబాబు అని, కోడి కత్తితో జగన్ పై దాడి చేయించిందని బాబు అని క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు అవి అబద్దాలు అని తేలిపోయాయి. దీంతో జగన్కు రివర్స్ అవుతుంది. ఇక జగన్ అబద్దాలు చెబుతుంటే వాటిని చంద్రబాబు, నారా లోకేష్ సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు. గతంలో ఉంటే ప్రభుత్వం నడుపుతుండటం వల్ల రాజకీయంగా కొన్ని అంశాల్లో పై చేయి సాధించలేకపోయారు.
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి..పూర్తిగా ప్రజల్లో ఉంటూ జగన్ చెప్పే అబద్దాలని తిప్పికొడుతున్నారు. అయితే ఓ వైపు చంద్రబాబు, మరొక వైపు లోకేష్…టిడిపిని గెలిపించడం కోసం కష్టపడుతున్నారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నిన వాటికి చెక్ పెడుతూ..ఇద్దరు ప్రజా మద్ధతు పెంచుకుంటున్నారు. ఓ రెండేళ్ల క్రితం దారుణమైన స్థితిలో ఉన్న పార్టీని ఇప్పుడు అధికారం సాధించే దిశగా తీసుకొచ్చారు.
ఇటు బాబు ఏమో రోడ్ షోలు, భారీ సభలతో ముందుకెళుతుంటే..అటు లోకేష్ పాదయాత్రతో దూసుకెళుతున్నారు. జగన్ సభలు కూడా పెడుతున్నారు. కానీ అక్కడ ప్రజలని బలవంతంగా తరలిస్తున్నారు. ఇటు బాబు, లోకేష్ సభలకు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. దీని బట్టి చూసుకోవచ్చు. ప్రజా మద్ధతు ఎవరికి ఉందో. మొత్తానికి బాబు-చినబాబు రాష్ట్రాన్ని రౌండప్ చేసి..జగన్కు చుక్కలు చూపిస్తున్నారు