సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత తన 28వ సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఈ సినిమాకు గుంటూరు కారం అనే మాస్ టైటిల్ అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా నుంచి వచ్చిన చిన్న టీజర్ కూడా ఈ సినిమాపై భారీ అంచినాలు పెంచేసింది. ఇన్ని అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా షూటింగ్ అయితే మాత్రం నత్తనడక కంటే చాలా దారుణంగా జరుగుతుంది.
ఇక గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ తప్పుకున్నారు అంటూ వస్తున్న వార్తలతో సినిమాపై మహేష్ అభిమానులు తెగ కంగారు పడిపోతున్నారు. ముందు సినిమా షూటింగ్ ఎన్నోసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ తప్పుకున్నారన్న ప్రచారంతో మరింత ఆందోళన మొదలైంది.
ఇలాంటి ఈ నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతున్నా కూడా ఈ సినిమా క్రేజ్ ఏం మాత్రం తగ్గటం లేదు. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే మొదలైంది. గుంటూరు కారం సినిమా నైజాం హక్కులు భారీ ధరకు అమ్ముడైపోయినట్లు తెలుస్తుంది. నైజాం అంటే అందరికీ గుర్తుకొచ్చే పేరు దిల్ రాజు.. ఈ సినిమా రైట్స్ కూడా రాజు చేతికే చిక్కేశాయి.
ఈ సినిమా నైజాం హక్కులను ఏకంగా రూ.40 కోట్లకు పైగా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ స్థాయిలో బిజినెస్ జరగటం అనేది రికార్డనే చెప్పాలి. ఇంత భారీ స్థాయిలో బిజినెస్ చేసుకుంటున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాతో మహేష్ ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.