తెలుగు సినిమా రంగంలోనే కాకుండా.. తమిళ నాట కూడా ఉత్తమ నటిగా పేరు తెచ్చుకున్న అలనాటి హీరోయిన్ ఎస్. వరలక్ష్మి. బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లో ఎస్. వరలక్ష్మి.. దాదాపు 15 సినిమాల్లో హీరోయి న్గా నటించింది. తర్వాత.. సావిత్రి, అంజలీదేవి, భానుమతిల ప్రభావంతో ఎస్. వరలక్ష్మి క్యారెక్టర్ పాత్రలకు పరిమితం అయ్యారు. అయితే.. వరలక్ష్మిలో ఉన్న గొప్ప టాలెంట్ ఏంటంటే… ఆమె గాయకురాలు.
అంతేకాదు.. సంగీత దర్శకురాలు. అలానే భరత నాట్యంలోనూ వరలక్ష్మికి ఎంతో అనుభవం ఉంది. హీరోయిన్గా చేసిన తొలితరం సినిమాల్లో ఈ మూడు పాత్రలూ ఆమె పోషించారు. ఒకటి రెండు సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా చేశారు. ఇక, ఆమె సినిమాల్లో భానుమతి మాదిరిగానే తన పాటలకు తానే గాత్రం ఇచ్చేవారు. ఇక, చిన్న పాటి డ్యాన్స్ అయినా.. ఉండాలని పట్టుబట్టేవారు. ఇలా.. వరలక్ష్మి ప్రత్యేకత చాటుకున్నారు.
అయితే.. ఎప్పుడైతే.. హీరోయిన్ పాత్రలుత గ్గాయో.. ముందు చూపుతో ఆమె టీ నగర్లో భరత నాట్యం స్కూల్ను ప్రారంభించారు.(ఇప్పుడు లేదు) వర్ధమాన నటీనటులకు.. ఆమె డ్యాన్స్లో శిక్షణ ఇచ్చేవారు. ఇది బాగా ఆదాయంలో నడిచింది. వెంపటి పెద సత్యం వద్ద ఆమె ఓనమాలు దిద్దుకున్నారు. అయితే.. నర్తన శాల సినిమాలో బృహన్నల పాత్రను పోషించిన అన్నగారు కూడా.. ఒకటి రెండు స్టెప్పుల కోసం.. వరలక్ష్మి స్కూల్లో చేరారు.
అయితే.. అన్నగారి అంతటి వారికి తాను నేర్పించడమా? అని వరలక్ష్మి ఒప్పుకోలేదు. దీంతో తన గురువును ఆహ్వానించి.. అన్నగారికి తన స్కూల్లో స్టెప్పులు నేర్పించారు. ఈ సినిమాలో డ్యాన్స్ వెంపటి పెద సత్యం అని పేరు వేశారు. అక్కడే వరలక్ష్మి స్కూల్ అని కూడా అన్నగారు పేర్లలో రాయించడం విశేషం.