టీడీపీ ఖాతాలో ప‌క్కాగా 18 ఎంపీ సీట్లు… !

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇటీవ‌ల జాతీయ మీడియా ఒక‌టి.. వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన రిపోర్టుపై వివాదం చెల‌రేగింది. మొత్తం పాతిక పార్లమెంటు స్థానాల్లోనూ.. వైసీపీ 24 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని.. స‌ర్వే స్ప‌ష్టం చేసింది. అయితే.. ఇది పెయిడ్ అని..ఉద్దేశ పూర్వ‌కంగానే ఈ స‌ర్వే ఇచ్చార‌ని రాజ‌కీయంగా ర‌గ‌డ‌తెర‌మీదికి వ‌చ్చింది.

Jayadev Galla - Feeling confident.. Thanks to the entire Team TDP Golden  Guntur.. Quality & Clarity of Vision, Ideas, People, Systems and  Processes.. | Facebook

ఇదిలావుంటే, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నించిన రాజ‌కీయ నేత‌లు.. పండితులు వైసీపీకి వ్య‌తిరేక ప‌వ నాలు వీస్తున్నాయ‌నే వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఈ వ్య‌వ‌హారంలో టీడీపీ అలెర్ట్ అయింది. వైసీపీ వ్య‌తిరే క‌త ఉంద‌న్న నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ దూకుడు పెంచాల‌ని నిర్ణ‌యించింది. ఉదాహ‌ర‌ణ‌కు అనంత‌పురం, హిందూపురం పార్ల‌మెంటు స్థానాలు. ఇక్క‌డ వైసీపీకి తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. ఇక‌, గుంటూరు పార్ల‌మెంటు స్థానం నుంచి మ‌రోసారి టీడీపీ గెలిచే ఛాన్స్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీనికి కార‌ణం.. ఇక్క‌డ వైసీపీకి ప్ర‌మాద‌పు గంట‌లు మోగుతున్నాయి.

Kesineni Srinivas Nani: TDP MP threatens to quit party over Twitter war  with party MLC, tells Naidu to 'control your pet dog' | India News

వాస్త‌వానికి గుంటూరు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఖాతాలోనే ఉంది. వ‌రుస‌గా గ‌ల్లా జ‌య‌దేవ్ గెలుస్తున్నారు. దీంతో ఈ ద‌ఫా అయినా.. వైసీపీ గెలుస్తుంద‌నే లెక్క‌లు వ‌చ్చాయి. కానీ, గ్రౌండ్ లెవిల్లో.. రాజ‌ధాని ఎఫెక్ట్ బాగా ప‌నిచేస్తోంద‌ని అంటున్నారు. దీంతో ఇక్క‌డ మ‌ళ్లీ టీడీపీ గెలిచే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ సీటుకు భారీగా డిమాండ్ ఏర్ప‌డింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌.. కేంద్ర మాజీ మంత్రి సుజ‌నాచౌద‌రి రెడీగా ఉన్నారు.

TDP MP Ram Mohan Naidu Seeks Paternity Leave from LS Speaker Om Birla Amid  Ongoing Budget Session

ఇక‌, మ‌చిలీపట్నం, విజ‌య‌వాడ‌, శ్రీకాకుళం, హిందూపురం, న‌ర‌సారావుపేట‌ నియోజ‌క‌వ‌ర్గాలోనూ..ఇదే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇలా.. రాష్ట్రంలో సుమారు 18 పార్ల‌మెంటు స్థానాల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఇలా ఒక్క రోజులో చేసింది కాద‌ని.. టీడీపీ వ్య‌వ‌హారాల‌ను గ‌మ‌నిస్తున్న వారు చెబుతున్నారు. వైసీపీ ప‌క్కా పోగొట్టుకునే స్థానాల‌తో పాటు.. టీడీపీ మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకునే స్థానాల‌ను ప‌రిశీలిస్తే.. మొత్తం 18 స్థానాల్లో టీడీపీ పుంజుకునే ఛాన్స్ ఉంద‌ని స్ప‌ష్టంగా చెబుతున్నారు.