ఒకానొక దశలో తెలుగు ఇండస్ట్రీలో వరుస పెట్టి వివాహాలు జరిగాయి. 1980లలో అయితే.. ఒక సినిమాలో హీరో, హీరోయిన్లుగా చేసిన తర్వాత. సహజీవనం చేయడమో.. వివాహాలు చేసుకోవడమో.. అంతటా కనిపించింది. దీనిపై గుమ్మడి తాను రాసుకున్న పుస్తకంలో ఇదొక ట్రెండ్గా మారిందని చెప్పుకొచ్చారు. అయితే.. ఎవరూ చిన్నపిల్లలు కాకపోవడంతో ఎవరినీ కాదనలేని పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. అయితే.. ఇలా చేయడం వల్ల సినిమాలపై ప్రభావం కనిపించిందని ఆయన రాసుకొచ్చారు.
“అనేక సినిమాల్లో అన్నగారు ఎన్టీఆర్, అక్కినేని నటించారు. కానీ, వారు ఎప్పుడూ.. తమ తమ హద్దుల్లోనే ఉండేవారు. ఎవరూ హద్దులు మీరేవారు కాదు. ఎక్కడా దారి తప్పింది కూడా లేదు. కానీ, వీరి తరం తర్వాత.. అనేక మంది హీరోలు, హీరోయిన్లు అలా నిబద్ధతతో ఉండలేక పోయారు. వీరి వల్ల ఒకానొక దశలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చే సాగింది“ అని గుమ్మడి రాసుకొచ్చారు.
ఆ సమయంలోనే జీవిత, రాజశేఖర్ వంటి అనేక మంది హీరో హీరోయిన్లు దంపతులు అయ్యారు. దీనిని తప్పు పట్టకపోయినా.. దంపతులుగా మారిన కుటుంబాలకు అవకాశాలు రావనే ప్రచారం అయితే ఉంది. దీంతో ఇండస్ట్రీలో ఈ తరహా పరిస్థితులను అరికట్టాలని అన్నగారు భావించినా.. అది ఫలితం లేకుండా పోయిందని గుమ్మడి చెప్పారు.
వ్యక్తిగత జీవితాల్లోకి మనం ఎందుకు ? వెళ్లాలన్న అక్కినేని మాటే నిజమైందని అన్నారు. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్గా మారిన వివాహాలు ఇండస్ట్రీపై ప్రభావం చూపించాయనేది వాస్తవం.