ఆదిపురుష్ సినిమాలో శూర్ఫణఖ పాత్రలో నటించిన ఈ బ్యూటి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే .. షాక్ అయిపోతారు..!!

చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆది పురుష్‌ సినిమా పేరే వినిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా, కృతి సనన్‌ సీతగా నటించారు. ఈనెల‌16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా తొలిరోజే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు కొలగొట్టి భారీ కలెక్షన్లు దిశగా దూసుకుపోతుంది.

అదే సమయంలో రామాయణంలో శూర్ఫణఖ అంటే రావణాసురుడు చెల్లెలు. ఆమె రాముడు అందం గురించి పొగుడుతుంది. తనను పెళ్లి చేసుకోమని కోరుతుంది. అందుకు రాముడు తనకి అప్పటికే పెళ్లి జరిగిందని.. తాను ఏకపత్రీవ్రతుడనని చెప్పడంతో ఆమె రగిలిపోతుంది. అంతేకాదు ఆమె చేసిన పనికి లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపుతాడు. ఇక ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలో శూర్ఫణఖ పాత్రలో నటించిన తేజస్విని పండిట్ గురించి వార్తలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి.

Swathi Bellam on Twitter: "Mark my words this movie will go down as biggest  disaster in Indian cinema This doesn't look Ramayan from any angle. They  had 6 months to work on

ఈ సినిమాలో ఆమె చాలా క్రూరంగా కనిపించినా.. తేజస్విని పండిట్ రియల్ లైఫ్ లో ఓ స్టార్ హీరోయిన్.. మరాఠా చిత్ర పరిశ్రమలో ఈమె పాపులర్ హీరోయిన్. 2004లో వచ్చిన మరాఠీ సినిమా ఆగబాయి ఆరేషా అనే సినిమాతో ఈమె కెరీర్‌ ప్రారంభించింది. తొలి సినిమాలోని నెగటివ్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తేజస్వి పండిట్‌ కేవలం వెండితెర పైన కాకుండా బుల్లితెరపై కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఉత్తమ న‌టిగా ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు కూడా దక్కించుకుంది.

తేజస్వి తన వ్యక్తిగత జీవితంలో చాలా గ్లామర్ పాత్రలో నటించింది. ఆమె ఇటీవల పలు వెబ్ సిరీస్ ల్లోనూ నటించి ఆకట్టుకుంది. ఇప్పుడ ఆదిపురుష్ లో ఆమె పోషంచింది రాక్షసి పాత్ర అయినప్పటికీ ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఏది ఏమైనా ఈ మోడ్రన్ అందాల శూర్పణక అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పాలి’..!!