అర్ధరాత్రి అల్లు అర్జున్ ఫామ్ హౌస్‌లో పూజలు.. ఇండ‌స్ట్రీలో ఒక్క‌టే క‌ల‌క‌లం…!

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం పుష్ప-2 .. ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. పుష్ప సినిమా భారీ హిట్ కావడంతో పుష్ప -2 చిత్రం పైన ఫుల్ ఫోకస్ పెట్టారు సుకుమార్. ఈ సినిమా అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించడం జరిగింది.

అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఫామ్ హౌస్ లో కొన్ని ప్రత్యేకమైన పూజలు నిర్వహించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు కారణం అల్లు అర్జున్ జాతకంలో ఒక పెద్ద దోషం ఎదురవ్వడమే అన్నట్లుగా తెలుస్తున్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ జాతకం ప్రకారం ఏదో ఒక పెద్ద దోషం ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు గుర్తించి అతని ఫ్యామిలీ పూజారితో ఈ పూజలు నిర్వహించినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు. పుష్ప సినిమా విడుదలై మంచి క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ అన్ని భాషలలో కూడా అదే క్రేజ్ ని సంపాదించారు. దీంతో అల్లు అర్జున్ కు నర దిష్టి ఎక్కువైందని అందుచేతనే అల్లు అర్జున్ ఫామ్ హౌస్ లో ఇలాంటి ప్రత్యేకమైన పూజలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ పూజలు చేయడానికి ముఖ్య కారణం తన సినిమాలు ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉండడంతో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఇలా చేశారని సమాచారం. అయితే ఈ పూజలో అల్లు అర్జున్ తో పాటు అతని భార్య స్నేహ పిల్లలు అయాన్, అర్హాలు కూడా పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ పూజలు అర్ధరాత్రి పూట నిర్వహించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.