టీఆర్పీ రేటింగ్స్ కోసం టీవీ ఛానల్స్ రకరకాల స్టంట్స్ చేయడం చాలా కామన్. ఏదో గొడవైనట్లు లేదా కాంట్రవర్సీస్ సృష్టించడం, ఇంకేదైనా డబుల్ మీనింగ్ వర్డ్స్ వాడటం అనేది టీవీ ప్రోగ్రామ్లో జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ రోజుల్లో టీఆర్పీ రేటింగ్స్ కోసం చేస్తున్న పనులు శృతి మించుతున్నాయి. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో కంటెంట్ కోసం యాజమాన్యం పడుతున్న తిప్పలు హాస్యాస్పదంగా, వెగటుగానూ మారుతున్నాయి.
ప్రధానంగా కమెడియన్ హైపర్ ఆది కంటెంట్ కోసం డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ చాలా దిగజారి ప్రవర్తిస్తున్నాడు. జులై 26కు సంబంధించిన ఢీ ప్రోగ్రామ్ ప్రోమో రిలీజ్ కాగా అందులో ఆది మాట్లాడిన డబుల్ మీనింగ్ మాటలు షాక్కి గురి చేస్తున్నాయి. ఈ ప్రోమో సగంలో హైపర్ ఆది చిరిగిన షర్టు, లుంగీ కట్టుకొని, చేత బాటిల్ పట్టుకొని ఎంట్రీ ఇవ్వడం కనిపించింది.
పువ్వాయ్ పువ్వా అంటాడు ఆటో అప్పారావు అనే పాట పాడుకుంటూ ఆది నడుచుకుంటూ వస్తాడు. ఒక భగ్న ప్రేమికుడిగా అతడు మందు తాగుతూ స్టేజ్ మీదకు రాగా “ఏంటి ఆది స్టేజ్ మీదకి మందు తాగుతూ వస్తావా?” అని శేఖర్ మాస్టర్ అడుగుతాడు. దానికి ఆది దురుసుగా సమాధానం ఇస్తూ “నీ ప్రాబ్లమ్ ఏంటి శేఖర్?” అంటాడు. దాంతో శేఖర్ కాస్త షాక్ అవుతాడు. “ఫస్ట్ టైమ్ ముందు తాగుతున్నట్లు ఉన్నాడు. అందుకని ఇలా బిహేవ్ చేస్తున్నాడేమో” అని శేఖర్ మాస్టర్ అంటాడు.
ఆ మాట వినగానే “ఎవడికోయ్ ఫస్ట్ టైమ్! ఐదు సీజన్ల నుంచి తాగుతున్నా… గుడ్డు తెలుసా నీకు?!” అని ఆది డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోతాడు. అది విన్న శేఖర్ మాస్టారు ఇవే మాటలు అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. తర్వాత ఆది కామ్ గా సోఫాలో కూర్చుంటాడు. ఇదంతా సరదాగా, టీఆర్పీ రేటింగ్స్ కోసమే జరిగినా శేఖర్ మాస్టర్ పట్ల హైపర్ ఆది అసభ్యంగా ప్రవర్తించినట్లుగానే అనిపించింది. అది జోక్ పరంగానైనా అడల్ట్ జోక్స్ ఎవరితో చేయాలో వారితోనే చేయాలి.
అసలు మింగటం, మొగ్గ, గుడ్డు వంటి డబుల్ మీనింగ్ వర్డ్స్ ప్రేక్షకుల్లోకి ఎలా వెళ్తాయో ఢీ నిర్వాహకులు కొంచెం కూడా ఆలోచించకుండా అనుమతించడం బాధాకరమని చెప్పవచ్చు. ఫ్యామిలీస్ చూసే ఈ షోస్ కాస్త పద్ధతిగా పెట్టుకుంటే బెటర్ అని ప్రేక్షకులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే హైపర్ ఆది పచ్చి బూతులు మాట్లాడుతూ ఓవరాక్షన్ చేస్తున్నాడని కూడా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది అని వార్నింగ్ కూడా ఇస్తున్నారు.