బాలయ్యతో చిందుల‌కు సై అన్న మ‌ర‌ద‌లు పిల్ల‌… మ‌రోసారి నాటు ఘాటు స్టెప్పుల మోత‌..!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోలు కన్నా సీనియర్ హీరోలే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నారు. వారు ఎంచుకొనే కథలు కూడా యంగ్ హీరోలు కన్నా బెటర్ గా ఉంటున్నాయి. ప్రజెంట్ టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు రెండు.. మూడు సంవత్సరాలకి రెండు సినిమాలు చేస్తుంటే సీనియర్ హీరోలు మాత్రం సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.
ఇప్పుడు ఈ లిస్టులోనే అందరికన్నా ముందు వరుసలో ఉంటాడు నట‌సింహం నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం సీనియర్, జూనియర్ హీరోలనే బేధం లేకుండా అందరికీ గట్టి పోటీ ఇస్తున్నాడు. ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డిగా వచ్చి బాలయ్య మరో బిగ్గెస్ట్ హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో భగవంత్‌ కేసరి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత తన 109వ సినిమాను మెగా దర్శకుడు బాబీతో చేయబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా రకుల్ ప్రీత్ సింగ్, నయనతార హీరోయిన్లగా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం మరో ఖతర్నాక్ బ్యూటీని లైన్ లో పెట్టాడు బాబీ అంటూ వార్తలు వస్తున్నాయి.
వీరసింహారెడ్డి సినిమాలో బావ, మరదలుగా నటించిన హనీ రోజ్- బాలయ్యను మరోసారి వెండితెరపై చూపించబోతున్నారట బాబీ. బాలయ్య 109వ సినిమాలో హనీ రోజ్ స్పెషల్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పిందట. ఇక ఈ సాంగ్ కూడా ఇప్పటివరకు బాలయ్య కెరీర్ లోనే చూడనీ విధంగా చాలా నాటు ఘాటుగా కలిపి మాస్ స్టెప్పులతో ఉంటుంద‌ని టాక్ ? దీంతో బాలయ్య అభిమానులు మరోసారి హనీరోజ్‌తో బాలయ్య స్టెప్పులు చూడొచ్చు అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.