హీరోయిన్ ఆదాశర్మ మన తెలుగు వాళ్లకు బాగాపరిచయం. నితిన్ హార్ట్ ఎటాక్ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఆమెను చాలా మంది మర్చిపోయారు. అయితే రీసెంట్గా ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అదా శర్మ, ఆస్పత్రి పాలవ్వడం హాట్ టాపిక్గా మారింది. ఆమె కలుషిత ఆహారం తినడం వల్ల ఆమెకు అలర్జీ సోకిందని.. దీనికి తోడు డయేరియా లక్షణాలు కూడా కనిపించినట్టు సమాచారం.
ఆమె ఒక్కసారిగా తీవ్ర నీరసానికి గురి కావడంతో హుటాహుటిన ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేశారట కుటుంబ సభ్యులు. తన కొత్త సినిమా ప్రచారానికి రెడీ అవుతున్న సమయంలో ఆదా ఇలా అనారోగ్యానికి గురవ్వడంతో సినీ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక ప్రస్తుతం ఆమె ముంబయిలోని ఓ హాస్పిటల్లో ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది.
ఇక కేరళ స్టోరీతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అలా ఊహించని క్రేజ్, స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తోన్న ఆదా ఇప్పుడు వరుసగా సినిమాలు, వెబ్ సీరిస్లు చేస్తోంది. ఇలా బిజీగా కెరీర్ కొనసాగిస్తున్న టైమ్ లో ఆమె అనారోగ్యానికి గురి కావాల్సి వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు బాగా ప్రబలుతున్నాయి.
ఆదాకు కూడా అలాంటి వ్యాధే సోకినట్టుగా సమాచారం. దీనిపై అంత టెన్షన్ పడాల్సిన పనిలేదని ముంబైలో ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తోన్న వైద్యులు చెపుతున్నారు. ఇక ఆదా ఫిట్గా ఉండేందుకు ఆమె ఎప్పటికప్పుడు మార్షల్ ఆర్ట్స్తో పాటు అనేక ప్రాచీన కళల్లో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది.