యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫాన్ ఇండియా హీరో అయిపోయాడు. బాహుబలి సిరీస్ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నసలార్, కల్కి లాంటి సినిమాలు వరుసగా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి. అయితే బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు నిరాశ పరుస్తున్నాయి.
సాహో – రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాలు చేసినా ఫ్యాన్స్ కు ఎందుకో నచ్చలేదు. అయితే సలార్ తో తమ కొరత తీరిపోతుందని ప్రభాస్ అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అందరి చూపు సెప్టెంబర్ 28 మీదే ఉంది. ఆ రోజే సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రీసెంట్గా సలార్ టీజర్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఈ క్రమంలోనే ప్రభాస్ మీద ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఓ స్టార్ హీరో డైరెక్షన్లో ప్రభాస్ ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడట. సలార్తో ప్రభాస్ హీరోగా నటిస్తుంటే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా చేస్తున్నాడు. అయితే పృథ్వీరాజ్ హీరో కం, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. అలాగే తనకు వీలున్నప్పుడల్లా డైరెక్టర్ గా కూడా మారుతున్నాడు.
ఈ క్రమంలోనే తనలో దర్శకుడికి పని చెప్పి ప్రభాస్ కోసం అదిరిపోయే యాక్షన్ స్టోరీ రెడీ చేసాడట. ఈ యాక్షన్ స్టోరీ లైన్ ఇప్పటికే ప్రభాస్కు చెప్పాడని ప్రభాస్ చూద్దామని అన్నట్టు తెలిసింది. ఒకవేళ ఈ క్రేజీ ప్రాజెక్టు ఓకే అయితే స్టార్ డైరెక్టర్ – స్టార్ హీరో కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.