బుద్ధి లేదా… ఉద్యోగాలు పీకిస్తా… మీడియాపై మోహ‌న్‌బాబు ఫైర్‌..!

స్టార్ హీరో మోహన్ బాబు మరో విషాదంలో చిక్కుకున్నారు. మీడియాపై తన కోపం ప్రదర్శించారు. బుద్ధి లేదా అంటూ గదమాయించారు. ఉద్యోగాలు పీకి పడేస్తా అంటూ మీడియా వాళ్ల‌నే బెదిరించారు. షాద్‌నగర్ లో నడిచింది ఈ హంగామా అంతా. హైదరాబాద్ లో ఉండే మోహన్ బాబు షాద్‌ నగర్ కి ఎందుకు వచ్చారు..? అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం.

మోహన్ బాబు కి షాద్‌ నగర్ లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ పనులు కోసం ఆయన షాద్ నగర్ వచ్చారు. మోహన్ బాబు వస్తున్నట్టు ముందుగానే మీడియాకి తెలిసింది. రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్దకి మోహన్ బాబు కంటే ముందే మీడియా చేరుకుంది. మోహన్ బాబు వచ్చిన వెంటనే తమ కెమేరాలు ఆయ‌న ముందు పెట్టి క్వశ్చన్స్ తో విసిగించడం మొదలుపెట్టారు.

దీనితో మోహన్ బాబుకి కోపం వచ్చి మీడియాపై తన అస‌హ‌నం ప్రదర్శించారు. మీ ఉద్యోగాలు ఊడ‌పికిస్తానంటూ వాళ్ల‌ను బెదిరించారు. ఇదిలా ఉంటే సైలెంట్‌గా రిజిస్ట్రేషన్ చేయించడానికి కారణాలు ఏమయ్యి ఉంటాయని స్థానికులు అనుమానించారు. ఇక ఇటీవ‌ల మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే.

మోహ‌న్‌బాబు ఇద్ద‌రు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య ఆస్తి గురించి మనస్పర్థ‌లు త‌లెత్తాయి. అవి ఆస్తి పంపకాలు వరకు వచ్చాయట‌. ఈ క్రమంలోనే మోహన్ బాబు రిజిస్ట్రేషన్ పనిమీద షాద్‌నగర్ వచ్చినట్లు తెలుస్తుంది.