ఒకప్పుడు పౌరాణిక సినిమాలకు పెద్దగా స్కోప్ ఉండేదే కాదు. అయితే ఇప్పుడు మారుతోన్న ట్రెండ్ ప్రకారం ఆ సినిమాల సంఖ్య తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో బాలీవుడ్లో తెరకెక్కిన సినిమాయే ఆదిపురుష్. రామాయణంలోని అరణ్యఖాండ, యుద్ధఖాండ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ ఇతిహాస గాథను తెరకెక్కించారు.
ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అప్పుడే చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడిపోయాయి. సినిమాకు భారీ స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్లోనూ ఓ సీటును హనుమంతుడి కోసం ఉంచాలని.. ఆయన వచ్చి మన మధ్యలోనే కూర్చొని సినిమా చూస్తారంటూ దర్శకుడు ఓం రౌత్ డిస్ట్రిబ్యూటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్లలో ఒక సీటును హనుమంతుడి కోసం అలాగే ఉంచేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సీటు ఎలా ఉండాలో ఓ ఫొటో బయటకు వచ్చింది. సినిమా హాల్లోని ఓ సీటును కాషాయ రంగుతో ఉన్న క్లాత్లో అలంకరిస్తున్నారు. దానిపైన హనుమంతుడి ఫొటో ఉంది.
అలాగే ఆ క్లాత్పై ‘జై శ్రీరామ్’ అనే స్లోగన్ కూడా రాసి ఉంది. దీంతో ఇప్పుడు ఈ ఫొటోను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అయితే హనుమంతుడి కోసం వదిలిన సీటు పక్క సీట్లను మాత్రం ఎక్కువ రేటుకు అమ్ముతున్నారన్న వార్తలు వచ్చాయి. దీనిని ఆదిపురుష్ యూనిట్ ఇప్పటికే ఖండించింది.