పవన్ కళ్యాణ్ హీరోగా ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చేస్తున్న హరీష్ శంకర్కు అప్పుడే చుక్కలు కనపడుతున్నాయట. ఈ సినిమా షూటింగ్ ఎన్నికల తర్వాత వరకు కూడా కంప్లీట్ అవ్వదు అనుకుంటున్న సమయంలో తన నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. మాస్ మహరాజ్ రవితేజతో మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తుందని వార్తలు వచ్చాయి. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇంకా మొదటి దశలోనే ఉంది.
అయితే పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ దగ్గరికి రావడంతో రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు పవన్ చేతులో నాలుగు సినిమాలు ఉన్నాయి. బ్రో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న OG సినిమా కూడా చాలా వరకు పూర్తయినట్లు కనిపిస్తుంది. అయితే రెండు సినిమాలు మాత్రం బాగా డిలే అయ్యాయి. ఒకటి క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ‘ హరిహర వీరమల్లు ‘ ఈ సినిమా షూటింగ్ చాలావరకు కంప్లీట్ అయినా బ్యాలెన్స్ ఎన్నికలకు ముందు అవ్వదనే అంటున్నారు.
రెండోది హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ‘ . ఈ సినిమా షూటింగ్ మొదట్లోనే ఉంది. దీనివల్ల హరీష్ శంకర్ ఈ సినిమా కంప్లీట్ చేయడానికి చాలా కాలం పడుతుందని… పవన్ కళ్యాణ్ రాజకీయంలో బిజీగా ఉండడంతో ఈ లోగా రవితేజతో మరో తీయాలని ప్లాన్ ప్లాన్ చేసుకుంటున్నాడట.
ఎలక్షన్స్ అయ్యేవరకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద పవన్ ఫ్యాన్స్ పూర్తిగా ఆశలు వదిలేసుకోవాల్సిందే. హరిశంకర్ దర్శకత్వంలో 2019లో విడుదలైన ‘ గద్దల కొండ గణేష్ ‘ సూపర్ హిట్ అయ్యింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమా మీద ఆశలు పెట్టుకున్నాడు హరీష్. అయితే పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వకపోవడంతో ఈ సినిమా షూటింగ్ అసలు ఎప్పటకి పూర్తవుతుందో ? ఎప్పటకీ రిలీజ్ అవుతుందో తెలియకే ఈ లోగా రవితేజతో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడట..!