ఏపీలో వలంటీర్ల వ్యవస్థను ప్రజలకు, ప్రభుత్వ పథకాలకు మధ్య అనుసంధానం కోసం ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. అయితే కొందరు వలంటీర్ల చర్యల వల్ల ఈ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. ప్రభుత్వం ఎంత మంచి ఉద్దేశంతో ఈ వ్యవస్థ తీసుకువచ్చినా చాలా మంది వలంటీర్లు… ముఖ్యంగా ఇటీవల కాలంలో అనైతిక , అసాంఘీక చర్యలకు పాల్పడుతున్నారు.
తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. వైజాగ్ – పెందుర్తిలో దారుణం జరిగింది. బంగారం కోసం వృద్ధురాలు వరలక్ష్మి (72)ని గ్రామ వాలంటీర్ వెంకటేష్ హత్య చేశాడు. అయితే నిందుతుడు వెంకటేష్ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.